Tuesday, April 19, 2011



సృజనకి ఆరంభ క్షణం


చెప్పాలన్న కోరిక
రచించాలన్న తపన
కేవలం తన అస్తిత్వాన్ని తాను వెతుక్కోవటమే !

ఒంటికి పువ్వో
గడ్డిపరకో
ఇసుకో
లేక రాయో తగిలితే
నరనరానా ఒక పులకరింత
మళ్ళీ మళ్ళీ తాకాలని...ఇంకా ముట్టుకోవాలని...
ఆ తరవాత తాకకూడదని...
ఉప్పొంగే రక్తం మాటలాడే 
ఆ క్షణం
అభివ్యక్తి క్షణం
అదే క్షణం సృజనకి ప్రారంభం !

కళ్ళముందు ఎన్నెన్నో రంగులు కదలుతూనే ఉంటాయి
కానీ ఏదో ఒక రంగు
ఎప్పుడో కనురెప్పలని దాటి వెళ్ళి
కలలో కదలాడినప్పుడు
మనసు లోతుల్లో
ఉత్సాహం ఇంద్రధనుస్సుగా విరిసినప్పుడు
దిగులు మబ్బులు చీలినప్పుడు
సత్సంకల్పమనే జ్యోతి వెలిగే
అదే క్షణం సృజనకి ప్రారంభం !

గాలిలో తేలివచ్చే ఒక సువాసన
ఊపిరిలో కలవగానే
రాగమేదో పలుకుతూ
శ్వాసల తీగలని బిగిస్తుంది
మనసు హరిణం కలత చెంది తిరుగుతూ
అలసిపోయి కూలబడుతుంది
ముడుచుకుని పడుకుంటుంది

ఆ కలవరం
ఆ పిచ్చి పరుగు
ఓటమి గురించి అవగాహన
ఉన్నట్టుండి ఏదో దొరికిన ఆనందం.

ఆజన్మాంతం దాహంతో ఆత్మ
వెదుకుతూనే ఉంటుంది
నదులూ,సరోవరాలూ,బావులూ
కాని బతుకు ఎండ
గొంతులో ముళ్ళు మొలిపిస్తుంది

ఎప్పుడో ఒక నది దొరికితే
శబ్దభేది బాణమొకటి
ఒక జీవాన్ని హరిస్తుంది
ఐనా చావదు దాహం

ఇంకెప్పుడైనా ఒక సరోవరం కనబడితే
యక్షుడొకడు ఎదురుపడి
సంధిస్తాడు ప్రశ్నలని వరసగా
దాహార్తి మూర్ఛపోయి విలవిల్లాడుతుంది

నీటికోసం వెతుకులాట ఆగదు
అప్పుడొక జలపాతం కనిపిస్తే
దోసిలిపట్టి నీళ్ళు తాగి సేదతీరితే
చిరకాలపు ఆ దాహం తీరుతుంది
నిర్మలమైన పాల ధార
అమృతంతో తడిసిన పయ్యెద
తృప్తినిస్తుంది.

మౌనం బద్దలై
హద్దులు చెరిగిపోయి
శరీరం దిక్కులలో కరిగిపోయి
కేవలం మిగులుతుంది శూన్యం...దేహరహితంగా,
శూన్యంలోంచి పదాల నక్షత్రాలు పొడిచినపుడు
ఆ క్షణమే
అభివ్యక్తికి ఆరంభం !

అలాటి దుర్లభమైన క్షణం నాకు దొరికిందొకటి
అప్పగిస్తున్నాను దాన్ని నీకీక్షణాన
స్వీకరించు నిష్కపటంగా
ఇదొక్కటే అభివ్యక్తికి ఆరంభ క్షణం
సృజనకి ప్రారంభ క్షణం !

***************************************************************************************************

హిందీ మూలం : ఋషభదేవ్ శర్మ
అనువాదం : ఆర్.శాంత సుందరి
( ఏప్రిల్ పాలపిట్ట మాసపత్రికలో ప్రచురించబడింది)

Monday, April 11, 2011


మొక్క మూగదా?                                    
-------------

ఆలోచనల్లో తేలిపోతూ
ఒక రోజు ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు పడుతుంటే
నా కుడి చెవి మీద
పక్కింటి గోడ మీదుగా వాలిన
తీగొకటి తగిలినట్టనిపించింది
ఒక్క క్షణం
దాన్ని తోసెయ్యాలనీ
తుంపి పారెయ్యాలనీ అనిపించింది
కానీ నేనలాటి పనేదీ చెయ్యలేదు,
దాన్ని చేత్తో పట్టుకుని గోడ మీంచి తొంగి చూశాను.
దాని పాదు పూర్తిగా నీళ్ళులేక ఎండిపోయి కనిపించింది...
మౌనంగా ఆ తీగ నాకేం చెప్పాలనుకుందో తెలిసింది,
’నాకు కూడా దాహంగా ఉంది
ఒక బకెట్టు నీళ్ళు నాకు కూడా పొయ్యవా?’
అని అడిగిందది.
’తప్పకుండా,’అన్నాను నాలో నేనే
సందేహం లేదు
మొక్కలకి కూడా భాష ఉంది,
మనలాగే మాట్లడగలవు
అవి మూగవేమీ కావు!

-------------------------------------------------------
ఆంగ్ల మూలం : కుమరేంద్ర మల్లిక్
అనువాదం : ఆర్.శాంత సుందరి

Friday, April 8, 2011


¶¢ÀhµÀ嶢ÀAlµÀ ¶ª¶¢À¶ªï
-------------------

È¢ÀfºOµv³ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³ svô VµÀdÃà OµÃ±µÀÛ¶mé Oµ¶mùvÇàAd³ù OÉ»ª VµÃ¥¹fµÀ.CAlµ±µÃ ¤ÀdºAS³ Oº ¶®ŸY±µ±ÀµÃ±µÀ.D±ÀµÀ¶m Èplµ¶¢Áv ¤Àlµ W¶mé W±µÀ¶m¶¢Áýö lÐsÃVµÀv¹fºAl¼.D±ÀµÀ¶m IAlµÀOµÀ ¶m¢¸öfÐ m¸OµÀ C±µæËÈ¢ÀAl¼ : CAlµ±¼O½ ËÈ¢lµï±µASµAvÑ hµvÇhÉå xSµv³ OɶªÀvAdÉ V¸v¹ D¶ªOºå GAdÀAl¼, ¶¢ÀÀPïAS¸ Cl¼ ¶¢À±ÍOµ±¼Oº ¶ªAsAlû¼AW¶mËlÇhÉ ¶¢À±¿¶mÃ.

CAlµ±¼Oµm¸é ¾ªn±ÀµÀ±³ C¶m¾ªæ»ª±ÀµÃ f¸Oµà±³,DV¸±µï,ËSǶmO¸vZ´ªà ËÈ¢¶pÁ OжpAS¸ VµÃ»ª , "D¶p±É¶¨´m VÉʪ¶pÁýêfµÀ C¢¸OµÀvà Vµ¢¸OµÀvà ¶¢Ãd¹ôfµlµçn ¤ÀOÇné «¸±µÀô VÇq¸ê¶mÀ? ¤À±µAlµ±µÃ ±ÐS¼ ¶ªêýŶ¬ vÑ vÉlµÀ O¸sdºà ¤À ¶¢Ãdvɤ £¶mlµÀvÉ C¶mÀOµÀAd¹±µÀ.O¸o Cl¼ nYA O¸lµÀ.¶¢ÀhµÀåvÑ G¶mé¶pÁýêfµÀ OµÃf¸ ±ÐS¼ ¤À ¶¢Ãdvn C±µæA VɶªÀOÐSµvlµÀ.El¼ CAlµ±¼O½ hÇw»ª¶m £¶¨±ÀµÀÊ¢À.q¸¥¹Ûhµï lÉ¥¹vÑô OÍné v°µv f¸v±µÀô ¶m¶¨à¶p±¼¶®±µA OºAlµ Ev¹dº ¢¸dºOº VÇwô«¸å±µÀ, hÇvÀ«¸?F WOµÀÖvÑ E±µÀOµÀÖ¶méAlµÀOµÀ ¤À±É s¹lûµÀïvÀ.l¸¢¸ Ê¢»ª¶m ¢¸yµÀõ V¸v¹ ¶ªÀvsûµAS¸ ±µÀŸY¶¢ÁvÀ VµÃ»pAVµSµvÀSµÀh¸±µÀ

"f¸Oµà±³ DV¸±µï S¸±µÃ,F OɶªÀ Êm¶mÀ ¢¸S¼¶m ¢¸SµÀfµÀ SµÀ±¼AW O¸lµÀ.¤À OÍxSÉ ±ÐS¼ lµSµØ±µ I¶¢Ë±Çm¸ GAfÉdÀà Y¹Sµñhµå j¶ªÀOÐvÉlµÀ.±ÐS¼ SÍAhµÀvÑAW Èpdºà¶m dÃïs³ HfºqÒ±ÀÀAl¼ l¸né ¶¢À¡õ hµS¼wAVÉAlµÀOµÀ COµÖfµ C¶mȪædº´ªà vÉfµÀ.D D¶p±É¶¨´m VÉ»ª¶m ¶ª±µÝ´m ÊmÊm O¸sdºà ¶ª¶¬YAS¸Êm £¶p±¿hµËÈ¢À¶m OжpA ¶¢WÛAl¼.IOµÃùþÖþïŸY³ ¤À ¶ª±³! D ±ÐS¼Oº ËÈ¢lµïA VÉ»ªAl¼ Êm¶mÀ. ¤À OÍxS³ C¶¥ñlµè¶¢vô DÈ¢À q¸ñg¸vÀ OÐvÑê±ÀÉÀ ¶p±¼»ªæi J±µêfºAl¼,"Cn ¶¢ÀAfº ¶pf¸âfµÀ ¶ª±µÝ´m.

m¸±µAS³ ¶m¶mÀé È¢ÃVÉhÐå qÏfºV¸fµÀ,"Êm¶mÀ VÇq¸êm¸?J¶¢ÃhµñA C¶¢O¸¶¥A lͱ¼Oºm¸ LOµ±¼¤Àlµ ¶¢À±ÍOµ±µÀ lµAfÇhµÀåh¸±µÀ ¤zõlµç±µÃ!"Cm¸éfµÀ ±µ¶¬¶ªïAS¸.Êm¶mÀ ¶¢ÀÔ¶mAS¸ hµv¹fºAV¸¶mÀ.ËSǶmO¸vZ´ªà O½ C¶m¶ªædº´ªà O½ Ev¹ SÍfµ¶¢vÀ ŸY±µSµdA ¶¢Ã¶¢ÀÃvÉ.O¸o Ev¹ lµSµØ±¼nAW VµÃfµdA m¸OºlÉ È¢ÀÀlµdº«¸±¼.

¶ªÃ¶p±¼AdÇAfÇAd³ Sµs¹ Sµs¹ OµvSµYɶªÀOµÀm¸éfµÀ," ¾pôŸY³, ¾pôŸY³ ! E¶pêdºOÉ OбµÀàvÑ G¶mé OɶªÀn SµÀ±¼AW Vµ±¼ÛAVÉAlµÀOµÀ ¶¢À¶mA EOµÖfµ ¶ª¶¢ÃÊ¢¶¥¶¢À±ÀµÃA.f¸Oµà±³ SÐq¸v³ F OɶªÀOº ¶ªAsAlû¼AW¶m £¶¨±ÀµÃvn SµÀ±¼AW hµ¶m Ctûq¸ñ±ÀµÃvÀ È¢vôfºAV¸fµÀ.¶¢À¶m CfÍöOÉd³ ¤ÀdºAS³ Oº ¶®ŸY±µ¢¸vn D±ÀµÀ¶m Oб¸fµÀ," Cm¸éfµÀ,m¸ ËÈ¢¶pÁ VµÃ»p¶ªÃå.D¶ªêiñ xSµv³ CËfÇþöŸY±³ S¸ F OɶªÀ £¶¨±ÀµÀA £Êm G¶mé¶pêdºO½ ¶pñhµï°µAS¸ £¶mdA ¶¢ÀÀPﶢÀn ¤ÀdºAS³ Oº ¶¢V¸Û¶mÀ.CAhÉ O¸Oµ CfÍöOÉd³ ¶pñi¶ªêAlµ¶m Iv¹ GAdÀAlÐ VµÃf¸vn OµÃf¸ C¶mÀOµÀm¸é¶mÀ."¶¢Ã CfÍöOÉd³ hµ¶mOµÀ¶mé £ÀSµh¸ ¶p¶mÀvoé ¶¢Ã¶mÀOµÀn EOµÖfºOº ¶¢V¸ÛfµÀ.¶¢À¶m hµS¸l¸vhÐ D±ÀµÀ¶m ËdÇ´¢À Ê¢´ªà VDZÀµÀïOµÀAf¸ D±ÀµÀ¶m VÇÊpêl¼ £Al¸A, ¶pñ¶¥évOº Y¢¸sÀvÀ VǶpÁl¸A,¤ÀOµÀ¶mé ¶ªAlɶ®vn n¶¢Åiå VɶªÀOµÀAlµÀ±µÀ S¸n,CAhÉ hµ¶pê ¤ÀvÑ ¤À±µÀ qÒd¹ôfµÀOж¢lµÀç,"Cm¸éfµÀ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³.

CfÍöOÉd³ O¸±ÀÀh¸vÀ i±µSÉʪ vѶpv C¶m¶ªædº´ªå,ËSǶmO¸vZ´ªà EAO¸ qÏSµvÀ OµOµÀÖhµÃÊm OµÃ±µÀÛm¸é±µÀ.CfÍöOÉd³ SÍAhµÀ ¶ª¶¢±¼AVµÀOµÀn,"¤À±µÀ CAdÀ¶mé dÃïs³ lÉnOº G¶p±ÀÇÃS¼«¸å±µÀ?"Cn CfºS¸fµÀ.

"ClÍOµ q¸ô»ªàO³ ËÈp´p.l¸né ±ÐS¼ SÍAhµÀvÑOº ¶pA»p ¶ªË±Ç¶m È¢Ãh¸lµÀvÑ ¶¢ÀhµÀ嶢ÀAlµÃ, q¸ñg¢¸±ÀµÀÀ¶¢Á¹ vѶpwOº ¶pA¶pÁh¸¶¢ÀÀ,"C¶méfµÀ f¸.DV¸±µï.

"CAdÉ Cl¼ ±ÐS¼Oº q¸ñgm¸fº v¹dºlµ¶m鶢Ãd.l¸né jÊªÊªå ±ÐS¼ OÍné n£À©¸vvÑ VµnqÒh¸fµÀ,"C¶mél¼ ËSǶmO¸vZ´ªà.

f¸.DV¸±µï IlÐ C¶msѱÀÉÀAhµvÑ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³ D±ÀµÀné ¶¢Ãd¹ôfµlµçn ËȪSµ VÉ¥¹fµÀ.CfÍöOÉd³ ¶¢À¡õ Ev¹ CfºS¸fµÀ,"LOµ ±ÐS¼Oº ¶¢ÀhµÀ嶢ÀAlµÀ EWÛ¶m¶pÁýêfµÀ DÈ¢ÀOº hµ¶m VµÀdÃà G¶m颸yµÀõ ¶¢Ãd¹ôfµÀOµÀÊm ¶¢ÃdvÀ Iv¹ £n»p«¸å±ÀÀ?"

l¿nOº Y¢¸sÀ f¸.DVµ±µï VÇq¸êfµÀ,"¶¢ÀhµÀåvÑ G¶mé ±ÐS¼ ¶¢À¶mv¹SÉ Cné ¶¢Ãdvà £¶mSµvlµÀ,¶ªê¶¨àAS¸ C±µæA VɶªÀOÐSµvlµÀ.¶¢ÀhµÀ嶢ÀAlµÀ EVÉÛ £lû¸¶mA JAhµ ¶pñSµi «¸lû¼AWAlµAdÉ, ±ÐS¼ ¶pÁ¹±¼åS¸ VµVµÀÛ¶pfºqÒ±ÀÉÀAhµS¸ l¸né E¶¢öOµÖ±µvÉlµÀ,"Cm¸éfµÀ.

"CAdÉ ±ÐS¼Oº OÍAVÇA ¶ªêýŶ¬ GAdÀAlµm¸ ¤À±µÊml¼?"

"Cv¹SÉ C¶mÀOÐAfº.Ê¢À£ÀVÉÛ ¶¢ÀAlµÀvÀ DÈ¢Àn LOµ «¸æ±ÀÀ ¶¢ÀhµÀå ¶¢±µOÉ j¶ªÀOÇy¹å±ÀÀ.«¸¶¢Ã¶mïAS¸ CAhµOµm¸é IOµÀÖ¶¢ ¶¢ÀhµÀ嶢ÀAlµÀ Ê¢ÀA E¶¢öA."

CfÍöOÉd³ ÈpnùvÎå hµv SÐOµÀÖAdÃ,"±ÐS¼Oº ¤À ¶¢ÃdvÀ £n»p«¸å±ÀµÀAdÀm¸é±µÀ Oµl¸, C±ÀÀhÉ mÍ»pê OµÃf¸ hÇvÀ¶ªÀåAl¸ ¤À±µÀ OµiåhÐ OÐʪ¶pÁýêfµÃ?"Cm¸éfµÀ.

"J¤À hÇxlµÀ.mÍ»pê hÇw±ÀµÀ¶mAhµ ¶¢ÀhµÀ嶢ÀAlµÀ E«¸åA Oµl¸?"Cm¸éfµÀ f¸. DV¸±µï.
 EAO¸ m¸OµÀ C±µæA O¸¶¢dAvÉlµÀ...¶ªêýŶ¬ G¶mé ¶¢Àn»¨ Oµiå hµSµvS¸Êm svô¤ÀAW lµÃOº q¸±¼qÒl¸?"

"vÉlµÀ DÈ¢À O¸yµÃõ VÉhµÀvà Oµlµ¶pvÉlµÀ...DÈ¢Àn Cv¹dº »ªæivÑ GAVµÀh¸¶¢ÀÀ.C¶ªvÀ ±ÍS¼ hµ¶mhµ h¸¶mÀ H»p±¼ OµÃf¸ ¾pvÛvÉlµÀ,"Cm¸éfµÀ DV¸±µï

"¶¢À˱ÇhÉ Iv¹ siOº GAdÀAl¼?"

"LOµ dÃïs³ n SÍAhµÀvÑOº qÒnWÛ l¸n l¸ö±¸ H»p±¼ CAl¼«¸åA."

V¸v¹ ʪ¶pÁ ¶¢ÀÔ¶mAS¸ G¶mé hµ±µ¢¸hµ CfÍöOÉd³ ,"CAdÉ ¤À±µÀ LOµ¶pOµÖ ¶¢ÀhµÀ嶢ÀAlµÀ  E¶ªÃå ¶¢À±Ð¶pOµÖ ¶ªË±Ç¶m È¢Ãh¸lµÀvÑ H»p±¼ OµÃf¸ CAl¼«¸å±µ¶m鶢Ãd,"Cm¸éfµÀ.

"C¶¢Á¶mÀ, l¿né s¹ïvÇ´mùþâ C¶m¾ªæ»¨±ÀµÃ CAd¹±µÀ.El¼ V¸v¹ ¶ªÀ±µ°ºhµËÈ¢À¶m ¶plµèi."

"f¸Oµà±³ VÇ»pê¶ml¼ ¶ªË±Ç¶mlÉm¸?"Cn CfºS¸fµÀ CfÍöOÉd³ Sµl¼vÑ G¶mé Oµ¶mùvÇàAd³ n.

CAlµ±µÀ f¸Oµà±µÃô N¶mn hµv¹fºAV¸±µÀ.

CfÍöOÉd³ Oº D ¶ª¶¢Ãlû¸¶mA ¶ªAhµÅ»på Oµ±µAS¸ Cn»pAWAlÉÈ¢Ã, ¶¢À¡õ LOµ «¸±¼ O¸±ÀÀh¸vÀ i±µSÉ»ª,"ËÈpû´m...C±ÀÀhÉ F OɶªÀ vÑ JA Y±¼S¼AlÐ VǶpêAfº,"Cm¸éfµÀ.

l¸nOº Y¢¸sÀ ËSǶmO¸vZ´ªà VÇ»pêAl¼."±ÐS¼ ¶ªö±ÀµÀAS¸ LOµ f¸Oµà±µÀ.DÈ¢ÀOº ÈmvvÀ ¶pÁ¹±¼åS¸ nAfº ¶pñ¶ª¶¢ ¶ª¶¢À±ÀµÀA  l¸dº OµÃfµ ¶¢ÀÃfµÀ ±ÐŸYÂv±ÀÀAl¼.O¸o mͶpÁýêvÀ ±¸vÉlµÀ.Cv¹àò «ÕAf³ ¶p±¿°µvÑ ¦¶¥À¶¢Á È¢ÀfµOº sÎfµÀâh¸fµÀ VµÀdÀàOµÀqÒ±ÀÀ GAfµdA Oµn»pAWAl¼.C¶pÁýêfºOµ »ªŸYɱ¼±ÀµÀ´m D¶p±É¶¨´m VDZÀµÃïvn n±µä±ÀÀAV¸A."

f¸.DV¸±µï OµwêAVµÀOµÀn,"»ªŸYɱ¼±ÀµÀ´m VÉ»ª¶m¶pÁýêfµÀ, Ê¢ÀA O¸¢¸vÊm hµOµÀÖ¶¢ ¶¢ÀhµÀ嶢ÀAlµÀ E«¸åA.vÉOµqÒhÉ OµfµÀ¶pÁvÑ tfµâOº ¶pñ¶¢ÃlµA ¶ªAsûµ¤AVÉ V¸´mù GAdÀAl¼.F ±ÐS¼ £¶¨±ÀµÀA vÑ OµÃf¸ ClÉ VÉ¥¹A,O¸n lµÀ±µlµÅ¶¨à¶¢¥¹hµÃå Ev¹ ŸY±¼S¼Al¼!"Cm¸éfµÀ.

¶¢À¡õ ËSǶmO¸vZ´ªà CAlµÀOµÀAl¼,"Sµ±µí¶ªAXn hDZ¼V¸Oµ Ê¢À¶¢ÀÀ tfµân ËsÇdºOº jʪ ¶pñ±ÀµÀhµéA VÉ¥¹A.Cl¼ OÍAVÉA Oµ¶¨àAS¸ Cn»pAVɶª±¼Oº OÍl¼çS¸ ËÈp¶mÀAW Liåfº OµvSµYÉ¥¹A.¦¶¥À¶¢Á ¶ªÀvsûµAS¸ ËsÇdºOº ¶¢VÉÛ»ªAl¼.È¢AdÊm DOºù¤Àd±³ Cv¹±µA È¢ÃSµ«¸S¼Al¼.CAlµ±µÃ OµAS¸±µÀ¶pfµÀhµÃ C¶m¶ªædº´ªà OжªA VµÃ¥¹±µÀ, O¸o Chµ¶mOµÖfµ vÉfµÀ.LOµ±µÀ hµvÀ¶pÁ lµSµØ±µOÇzõ Chµné »pwV¸±µÀ.D¶p±É¶¨´m VÉ»ª¶m S¸±ÀµÀAnAW O¸±É ±µOµåA ¶¢ÀÀlµÀ±µÀ ±µASµÀvÑOº ¶¢Ã±µ«¸S¼Al¼.¶¢ÀhµÀ嶢ÀAlµÀ EVÉÛ Chµ¶mÃ, ±ÐS¼ sûµ±¸å...D±ÀµÀm¸ f¸Oµà±É...¶p±¼SÇhµÀåOÍV¸Û±µÀ.Êm¶mhµn ¤Àlµ C±¼V¸¶mÀ.C¶pÁýêfµhµ¶mÀ ±ÐS¼O½ È¢AdºvÉd±¿Ö OµÈmO³à VÉ»ª¶m dÃïsÀ £fºqÒ±ÀÀAlµn Sµ¶¢ÀnAV¸fµÀ.±ÐS¼ H»p±¼ihµÀåvOº ¶¢ÀhµÀ嶢ÀAlµÀ O¸n, DOºùY´m O¸n CAlµdAvÉlµÀ.CAlµÀOÉ DOºù¤Àd±³ Cv¹±µA È¢ÃS¼Al¼.Chµ¶mÀ dÃïsÀn ¶¢À¡õ hµS¼wAW DOºùY´m ¶pA»p ¶¢Ã¶¢ÀÃvÀ »ªæiOº j¶ªÀOÍV¸ÛfµÀ.ClµÅ¶¨àA OÍl¿ç DOºùY´m vÇÈ¢v³ ¶¢À±¿ OºAl¼Oº l¼SµvÉlµÀ.ËÈpS¸ ElµAh¸ ŸY±¼SÉAlµÀOµÀ LOµÖ n£À¶¨A ¶¢ÃhµñÊ¢À ¶pdàdA hÐ,Èp
lµç ¶®n OµÃf¸ ŸY±µSµvÉlµÀ."CAl¼.

CfÍöOÉd³ ¶¢ÀlûµïvÑ,"IOµÃùþÖþïŸY³ ¤À, DOºù¤Àd±³ CAdÉ J£Àdº?"Cn CfºS¸fµÀ.

Cl¼ ±µOµåAvÑ GAfÉ DOºùY´m n OÍwVÉ LOµ «¸lûµ¶m¶¢Àn f¸. DV¸±µï VÇq¸êfµÀ.

D hµ±µ¢¸hµ I¶¢±µÃ ¶¢ÃdôfµvÉlµÀ.D¶pÁfµÀ ¶ªÃ¶p±¼AhÇAfÇAd³,"VǶpêAfº v¹±ÀµÀ±µÀ S¸±µÃ,J¶¢ÀAd¹±µÀ?"Cm¸éfµÀ.

"¤À±µÀ C¶m¶ªædº´ªà hÐ J¶¢Àm¸é±µÀ?"Cn ËSǶmO¸vZ´ªà n CfºS¸fµÀ CfÍöOÉd³.

"Êm¶mÀ...Êm¶mÀ..."Cn DÈ¢À VÇÊpêAhµvÑ f¸.DV¸±µï,"'¤À±µÀ m¸ Êp¶¨Ad³ n VµAÊp»ª GAfÉ¢¸±µÀ,'CAl¸£fµ,"Cm¸éfµÀ.

"D ¶p±¼»ªæivÑ I¶¢Ë±Çm¸ ClÉ C¶mÀAfÉ¢¸±µÀ,"CAl¸£fµ.
"¾pôŸY³, Ev¹ SÍfµ¶¢ ¶pfµOµAfº.¢¸yµÀõ ŸY±¼S¼¶m l¸né n±µÃ»pAVµSµv±¸?"Cm¸éfµÀ CfÍöOÉd³.
"¢¸yµõlµSµØ±µ ±µÀŸY¶¢Ávoé Gm¸é±ÀÀ.ËÈpS¸ DÈ¢À sûµ±µå D ¶ª¶¢À±ÀµÀAvÑ D¶p±É¶¨´m k¼±ÀÉÀd±³ vÑÊm Gm¸éfµÀ,"Cm¸éfµÀ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³.

Cv¹d¶pÁýêfµÀ ¤À±µÀ ¢¸yµõn OбµÀàOº IAlµÀOµÀ È¢yµõnV¸Û±µÀ? ¤ÀvÑ ¤À±É ¶¢Ãd¹ôfº hÉvÀÛOж¢v»ªAl¼.

"Ê¢À¶¢ÀÀ LOµ fºq¸±³à È¢ÀAd³ ¤ÀdºAS³ OµAfµO³à VɶªÀåm¸éA.Cné £¶¨±ÀµÃvo °µÀgäAS¸ Vµ±¼ÛAW JA VDZÀµÃïvÑ n±µä±ÀÀ«¸åA,"Cm¸éfµÀ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³

"C¶¢Á¶mÀ m¸OµÀ OµÃf¸ OбµÀà ËsÇdÉ F ¶ª¶¢À¶ªïn ¶p±¼¶¨Ö±¼AVµÀOж¢dA ¶¢ÀAWlµn»p«ÒåAl¼.¤À±µÀ lµ±ÀµÀVÉ»ª ¢¸yµõ CfÍöOÉd³ hÐ ¶¢Ãd¹ôfµAfº.¶¢À¶mA hµS¼¶m ¶m¶¨à¶p±¼¶®±µA VÇwôl¸çA.Cl¼ lµÀ±µlµÅ¶¨à¶¢¥¹hµÃå ŸY±¼S¼¶m ¶ªA¶Td¶m Co , »pvôO½ hµwôO½ IdÀ¶¢Adº ¶®o OµvSµvÉlµo ¶¢ÃhµñA SµÀ±µÀåAVµÀOÐAfº.C»ªÈªàAd³ ¦¶¥À¶¢Án ËsÇdºOº j¶ªÀå¶mé¶pÁýêfµÀ dÃïsÀ £fºqÒ±ÀÀAl¼...LOµÖ °µgA ʪ¶pÁ H»p±¼ tSµsdàdA v¹dºl¼.Cv¹ LOµdº ±ÇAfµÀ n£À©¸vÀ H»p±¼ tSµsfºhÉ ¶¢VÉÛ ¶p±µ¶¢ÃlµÊ¢À¤À GAfµlµÀ!"Cm¸éfµÀ f¸.DV¸±µï

"¶ª¶¢À±ÀµÀA £ÀAWqÒOµ ¶¢ÀÀAlÉ £¶¨±ÀµÀA hÇw±ÀµÀdA ¶¢ÀAWlµ±ÀÀAl¼.O¸o, ImÐé n£À©¸v ¶¢±µOµÃ Sµ¶¢ÀnAVµOµ qÒhÉ JËÈ¢À GAfÉl¼?

"Ev¹dº ¶pñ¶¥évOº ¶ª¶¢Ãlû¸¶mA VǶpêOµÖ±Éôlµ¶mÀOµÀAd¹. El¼ C¶m¶¢¶ª±µËÈ¢À¶m ¶pñ¶¥é!"Cm¸éfµÀ ¶ªÃ¶p±¼AdÇAfÇAd³ OµdÀ¶¢ÁS¸.

CfÍöOÉd³ hµv CfµâAS¸ Dfº¶ªÃå,"O¸lµÀ El¼ C¶m¶¢¶ª±µA O¸lµÀ.m¸OÉ hÇvÀ¶ªÀOТ¸vn GAl¼.CAhµÊª¶pÁ DOºùY´m CAlµOµqÒhÉ J¶¢À¶¢ÁhµÀAl¼?"Cm¸éfµÀ.
"¶ª±É VǶpÁh¸¶mÀ.O¸o l¿né F ±ÐS¼hÐ ¶¢ÀÀfºÈpdàlµÀç.DOºùY´m Oº IOµÀÖ¶¢S¸ ¶ªêAl¼AVÉ sû¹SµA È¢ÀlµfµÀ.¶¢ÀÃfµÀ n£À©¸vʪ¶pÁ DOºùY´m CAlµOµqÒhÉ È¢ÀlµfµÀ lÇsìiÊm ¶pñ¶¢ÃlµA GAl¼.È¢ÀlµfµÀ È¢¶mOµ sû¹SµA SµÀAfÇo H»p±¼ihµÀåvo ClµÀ¶pÁVɶªÀåAl¼.Cl¼ lÇsì iAdÉ ¶¢Àn»¨ shµOµfµÀ,"Dm¸fµÀ f¸.DV¸±µï

¶ªÃ¶p±¼AhÇAfÇAd³ W±¸OµÀ ¶pf¸âfµÀ."F £¶¨±ÀµÃné ±ÐS¼Oº IAlµÀOµÀ hµS¼w¶ªÀåm¸é±µÀ?EOµÖfµ Cv¹dºlɤÀ ŸY±¼SÉ C¶¢O¸¶¨Ê¢À vÉlÉ?Ê¢À¶¢ÀÀ ʪ¾pûà È¢ÀY±³ù q¸dºAV¸¶¢ÀÀ, DOºù¤Àd±³ Cv±µA v¹dº£.Cl¼ d½A Oº AGAlÉ È¬VµÛ±¼Oµ ¶pA»p¶ªÀåAl¼,"Cm¸éfµÀ £¶ªÀS¸Ø.

ClÍöOÉd³ hµ¶m mÐd³ù OÉ»ª VµÃ»ª,"«¸±³,LOµÊ¢yµ ±ÐS¼ È¢ÀlµfµÀ ¶¢ÀÀAlµÀ sû¹S¸A ¶¢ÃhµñÊ¢À lÇsìiAdÉ JA Y±¼S¼GAfÉl¼?"

"l¸né Ê¢ÀA È¢ZdÉdº´¢ ʪàd³ CAd¹A.LOµ Yfµ¶pl¸±µæA v¹S¸ GAfºqÒhµÀAl¼ ±ÐS¼.IdÀ¶¢Adº ¶ªê¶mlµvà GAfµ¶¢Á.O¸o siOÉ GAdÀAl¼"Cm¸éf¸±ÀµÀ¶m.

"CAdÉ VµnqÒ¶¢dA Oµm¸é sûµ±ÀµÀAOµ±µËÈ¢À¶m »ªæi C¶m鶢Ãd!"

"V¸wAVµAfº v¹±ÀµÀ±µÀ S¸±µÃ!"F «¸±¼ ¶ªÃ¶p±¼AhÇAfÇAd³ Oº nŸYAS¸Êm OжpA ¶¢WÛAl¼."E£ V¸v¹ «¸AOÉiOµ¶p±µËÈ¢À¶m CA¥¹vÀ.¢¸dºn ¶¢ÃOÉ ¶¢l¼vÉÊªå ¶¢ÀAWl¼. È¢À¶¢ÀÀ EWÛ¶m ¶ªv¶® Ê¢À±µOº ¤À±µÀ OÉ´ª £¶¨±ÀµÀA VµÃfµAfº V¸vÀ!"Cm¸éfµÀ.

Cv¹ Cn D±ÀµÀ¶m vÉW nvsfº," ¶¢À¶mA C¶¢¶ª±µËÈ¢À¶m £¶¢±¸voé hÇvÀ¶ªÀOµÀm¸é¶¢ÀÊm C¶mÀOµÀAdÀm¸é¶mÀ.EOµ F ¤ÀdºA´T ¶¢ÀÀS¼AVµVµÀÛ.¤À±µAlµ±µÃ ¶¢ÀÔ¶mAS¸ Gm¸é±µÀ O¸sdºà ¶¢À¶mA OбµÀà ËsÇd F ¶ª¶¢À¶ªïn ¶p±¼¶¨Ö±¼AVµÀÛOТ¸v¶mé ¶pñ¶ªå¶¢¶mn CAlµ±µÃ CAS¿Oµ±¼AV¸±µn C¶mÀOµÀAdÀm¸é¶mÀ.v¹±ÀµÀ±µÀ S¸±µÃ,EOµ VDZÀµÃﶢv»ª¶mlÉ£ÀdÑ ¤À±µÀ VµÃ¶ªÀOÐAfº,"Cm¸éfµÀ.
----------------------------------------------------------------------------

Oµkµ O¸n Oµkµ
------------------
f¸. §ñSÐq¸v³ O¸s¹ñ

C¶mÀ¢¸lµA : D±³.¥¹Ahµ ¶ªÀAlµ±¼
-----------------------------------------------------------------------


Sunday, April 3, 2011


ఈ వ్యాపారికి దాహమెక్కువ
===============================

ఒక వైపు ధ్వంసమైన మురికివాడలూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు మునిగిపోతున్న పడవలూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు ఎండిపోతున్న నదులూ...ఒక వైపు నువ్వూ.
ఒక వైపు దాహర్తి తో ఉన్న లోకం...ఒక వైపు నువ్వూ.
అయ్యా శభాష్ ! ఏం చెప్పను నీ వైభవం?
నీళ్ళ వ్యాపారివి నువ్వు,
ఆటా నీదే ఆటగాడివీ నువ్వే,
పరచిఉన్న చదరంగం పావులూ నీవే.

నీరంతటినీ పీల్చేస్తున్నావు,
నదులూ సముద్రాలు దోచేస్తున్నావు,
గంగా యమునా గుండెలమీద,
బండరాళ్ళనే బద్దలుచేస్తున్నావు.

అబ్బా !నీ ఈ స్వార్థం
ఎన్నాళ్ళీ నీ దాష్టీకం
ఈ నేల కదిలిన రోజున
నీ తలపొగరంతా దిగిపోదా!

ఇళ్ళూ వాకిళ్ళు కొట్టుకు పోవా
శిధిలాలే ఇక మిగులి పోవా
బొట్టు బొట్టుకీ మొహంవాచి
ఇక ఏంచేస్తావో చెప్పు  వ్యాపారీ !

ఇవాళ పండగ జరుపుకుంటున్నావు
నదులనే దాహానికి గురిచేస్తున్నావు
గంగని బురదగా మరుస్తున్నావు

ఈ భూమి కంపిస్తే ఏంచేస్తావు?
వర్ల్డ్ బ్యాంక్ టోకెన్ పట్టుకు ఏక్కడికెళ్తావు?
ప్రాజెక్టులు వేస్తూ ఏమ్ చేస్తావు?
అప్పుల పాలై దిక్కులు చూస్తావు
ఒకవైపేమో ఎండిన నదులూ...ఒక వైపేమో నువ్వూ.
ఒకవైపేమో దాహార్తితో ఉన్న లోకం...మరోవైపు నువ్వూ !
***********************************************************************************************************************

మూలం : ప్రజాకవి,గిరీష్ చంద్ర తిబాడీ (గిర్దా) హిందీ కవితలు
అనువాదం : ఆర్.శాంతసుందరి








మను వెనక్కి వస్తాడా?
-----------------------

" వీడొకపట్టాన లేవడంలేదు, మీరు కాస్త లేపుతారా?" అంటూ వత్సల మొగుడు కప్పుకున్న దుప్పటి విసుగ్గా లాగేసింది.

"అబ్బా! ఏం చేస్తున్నావు?" అని కసిరాడు చరణ్.

"నేను లేపితే లేవడంలేదు. మీరు గట్టిగా కోప్పడితేగాని లేవడు వెధవ."

"మను ఇక్కడెక్కడ డున్నాడు వత్సలా? నీకేదో కల వచ్చుంటుంది! మను న్యూ జెర్సీలో కదా ఉన్నాడు?"

".............."

"హూం ! వాడు నీలాగ కలలు కంటున్నాడనుకుంటున్నావేమో నీ గురించి , అక్కడ వాడికి పగలూ రాత్రీ తేడా కూడా తెలీదు!వారానికో రెండు వారాలకో ఒకసారి ఫోన్ చేసి బాధ్యత తీర్చుకున్నాననుకుంటాడు.సర్లే, ఇక పడుకో!"అనేసి పదుకుండిపోయాడు.

చరణ్ ఒక డాక్టర్. ఎక్కువసార్లు వత్సలే కొడుక్కి ఫోన్ చేస్తుందని ఆయనికి తెలుసు. మను గురించి ఆలోచనలు బాధపెట్టకుండా ఆయన ఎప్పుడూ రోగులూ, మందుల్లో మునిగుంటాడు.

ఫోన్ చేసినప్పుడల్లా వత్సల కొడుకుని వెనక్కి వచ్చెయ్యమని ప్రాధేయపడుతుంది.అతనూ ఎప్పుడూ ఒకటే జవాబు చెపుతాడు,అక్కడికొచ్చి ఏం చేస్తాను అంటూ.

కొడుకు గుర్త్తొస్తూనే వత్సల లేచివెళ్ళి ఫోన్ చేసింది..."ఎలా ఉన్నవురా? ఇవాళ ఆదివారంకదా?ఇంట్లోనే ఉన్నావా?"

"ఆ,చెప్పు!"

"నువ్వు కల్లోకొచ్చావు,ఫోన్ చెయ్యాలనిపించింది.వెనక్కి రారా మనూ !ఇక్కడ ఉద్యోగాలకేమీ కొదవ లేదురా! పూనా,హైదరాబాదు,ఢిల్లీ,ముంబయి,బెంగళూరు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నీకు ఉద్యొగం దొరుకుతుంది మనూ!"

"సరే మరి జీతమో? ఇక్కడ నేను ఎంత సంపాదిస్తున్నానో తెలుసా అమ్మా?ఇక మన ఊరు? ఏమైనా మారిందా? నేను పుట్టినప్పుడున్న ఆ హైస్కూలూ,ఒకే ఒక కాలేజీ,ఒక డొక్కు రైల్వే స్టేషనూ. అయినా రాజకీయాలకేమీ కొదవ లేదు.కులం కుళ్ళూ, అవినీతీ...చెప్పక నాకు!"

"కానీ నువ్వు అక్కడికెళ్ళేందుకు చదువుకున్నది ఇక్కడే ,అది మరిచిపోకు!"

"అయితే ఏమిటిట? అందరూ ఎక్కడో ఒక చోట చదువుకుంటారు,పెరిగి పెద్దవాళ్ళవుతారు,అంతమాత్రం చేత అక్కడే పాతుకుపోవాలా?మా కంపనీ లో ఝార్ఖండ్ నించి వచ్చిన మిస్టర్  నిక్సన్ అనే ఒకతను  పనిచేస్తున్నాడు. అతని తలిదండ్రులు గిరిజనులు. అడవుల్లోంచి కాంట్రాక్టర్లు తరిమి కొడితే పట్నం పారిపోయి కంకరా మట్టీ ఎత్తుతూ కూలి పని చేసుకున్నారు.అక్కడ ఒక అమెరికన్ కూలివాళ్ళ పిల్లలకోసం ఒక క్రెష్ తెరిచాడు. ఒకప్పుడు నానీ అని పిలిపించుకున్న ఆ గిరిజన పిల్లవాడు ఇవాళ ఆ అమెరికన్ దయవల్ల మిస్టర్ నిక్సన్ గా మారాడు.అతని అమ్మా నాన్నా రాంచీ లో మంచి ఇంట్లో ఉంటున్నారు.వాళ్ళ రెండో కొడుక్కి అమెరికన్ దొర ఎవరూ దొరక్కపోవటంతో అతను నక్సల్స్ తో చేరిపోయి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు.ప్రభుత్వం చేసే అక్రమాలతో ప్రజల పక్షాన పోరాడుతున్నాడు."

"చూడు మనూ, మనం గిరిజనులం కాము.మన ఊళ్ళో మనకంటూ ఒక పెద్ద ఇల్లుంది.మీ నాన్న కూడా ఇంకా రిటైర్ అవలేదు.నీకు సరిపోయేంత సంపాదన మనకుంది.నువ్వు ఏ పనీ చెయ్యకపోయినా, హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చున్నా మనకి బెంగేమీ ఉండదు."

"ఏమీ చెయ్యకుండా కూర్చోవటంకన్నా ఇక్కడే ఏదో ఒక పని చేసుకోటం మంచిది కదమ్మా!"అంటూ నవ్వాడు మను.

"ఉన్న ఒక్కడివీ అంత దూరంలో ఉన్నావు.నిన్ను చాలా మిస్సవుతున్నాం రా!"

"నాకూ అలాగే ఉందమ్మా.పోనీ నువ్వూ,నాన్నా ఇక్కడికొచ్చెయ్యకూడదూ?ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు!బోలెడంత సంపాదించుకోవచ్చు,పని కూడా తక్కువే."

"నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావేమిట్రా?"

"అమ్మా,చిన్న కుటుంబం,ఉండే ఇల్లు చిన్నది,అలాటప్పుడు మనిషి గొప్పతనానికి గుర్తింపు డబ్బొక్కటే మరి.డబ్బూ అధికారం ఎప్పుడూ హోదానే తెలియజేసేవే కదా?ఇండియా లో అధికారం కావాలంటే లోకల్ గూండా అవాలి.ఇక్కడ చచ్చేట్టు పనిచెయ్యాలి."

"సర్లే! ఆ పన్నాలాల్ జైన్ గుర్తున్నాడా నీకు? వాళ్ళ పెద్దబ్బాయి తాతలకాలం నాటి బట్టలకొట్టుని చక్కగా నడుపుకొస్తున్నాడు.చిన్నవాడు సాగర్ లో ఆటో షోరూం తెరిచి బోలెడంత సంపాదిస్తున్నాడు.ఇక ఆ జైనయితే మునిసిపల్ చైర్మన్ అయాడు.ఊళ్ళోని రోడ్లన్నీ పక్కాగా వేయించాడు.ఇదంతా అభివృద్ధి కాదా?"

"కబుర్లు చెప్పకమ్మా! అక్కడ ఇవాళ అవినీతిపరులైన పారిశ్రామికవేత్తలదీ, లంచగొండి రాజకీయనాయకులదే రాజ్యం.నేషనలిజం ఎవడికీ పట్టలేదు.ధారావీ మురికివాడలో తయారుచేసిన వస్తువులని తమ సొంత ముద్ర వేసి లక్షలూ కోట్లూ సంపాదించుకుంటారు.స్లం డాగ్ మిలియనీర్ నేనూ చూశాను.మనదేశంలోని ప్రతి పెద్ద పట్నమూ స్లమ్స్ మీదే ఆధారపడి బతుకుతోంది."

"సరే నీకు దేశభక్తి ఉందికదా?ఇక్కడికొచ్చి ఈ అవినీతినీ అక్రమాలనీ పోగొట్టేందుకు పోరాడు..." వత్సల ఈమాటనగానే మను ఫోన్ కట్ చేసేశాడు.

వత్సల లేచి కూర్చుని ఆలోచనలో పడింది.ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కానీ ఆమెకి మళ్ళీ నిద్ర పట్టలేదు...

తల్లి పాలకీ ప్రేమకీ చాలా శక్తి ఉంటుందంటారు.మను నా పాలు తాగాడు,నా ప్రేమని పూర్తిగా పొందాడు.మరి నేను ఇన్నిసార్లు రమ్మని పిలుస్తూంటే అసలు పట్టించుకోడేం?

ఆమెకి భర్త మాటలు గుర్తొచ్చాయి,జనరేషన్ గ్యాప్,మార్పూ ప్రకృతి సహజం.అవి ఎప్పుడూ ఉన్నాయి.ప్రకృతి మనిషిని సృష్టించి ఊరుకుంది.మనిషి తన లక్ష్యాలని తనే నిర్ణయించుకుంటాడు.ప్రతి యుగంలోనూ అవి మారుతూ కూడా ఉంటాయి.చంద్రుడిమీదికి వెళ్ళివచ్చినా అతని బుద్ధి ఎత్తులకి ఎదగలేదు.ఇరాక్,పాకిస్తాన్,పాలస్తీనా,లాటి దేశాలు పేలుళ్ళని ఎదుర్కుంటున్నాయి.బాగుపడటం పేరుతో ఒకర్నొకరు చంపుకుంటున్నారు,గాయపరచుకుంటున్నారు.శ్మశాలను తయారుచేస్తూ దాన్ని మంచి చెయ్యటమని అంటున్నారు.లోకం నిజంగా బాగుపడుతోందా?బాగు అనేది ఒక ఆలోచన,తన బాగుతోపాటు అవతలివాడి బాగుకూడా కోరినప్పుడే లోకం బాగుపడుతుంది.అలా కానప్పుడు, అందరికీ అది అందనప్పుడు ఇక లోకం బాగుపడిందని ఎలా అంటాం?
 పని చెయ్యి కాని ఫలితాన్ని ఆశించద్దనే భగవద్గీత లోని  మాట వత్సలకి విచిత్రంగా అనిపిస్తుంది.ఒక పని చేస్తే దానికి ఫలితం లేకుండా ఎలా ఉంటుంది?తమ ఊళ్ళోనే మను కన్న రెండేళ్ళు పెద్దవాడు,యశరాజ్,తండ్రికి పెద్దగా డబ్బూ,తాహతూ లేకపోయిన ఎమ్.ఏ.వరకూ చదువుకుని కాంపిటిటివ్ పరీక్షల్లో ఐఏఎస్ పాసయి,ధిల్లీ లో ఏదో మినిస్ట్రీ లో అండర్ సెక్రెటరీ గా పనిచేస్తున్నాడు.అమ్మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.మూడు నాలుగు నెలలకొకసారి తలిదండ్రులతో గడపటానికి ఒక వారం రోజులు సెలవపెట్టి మరీ వస్తాడు.ఇంత పెద్ద ఆఫీసరై కూడా నువ్వేమీ మారలేదోయ్ అంటే,ఏడాదిలో పదకుండు నెలలు మనకోసం బతుకుతున్నాం,మనని పెంచి పెద్దచేసిన అమ్మా నాన్నలకోసం ఒక్క నెల బతకలేమా?వాళ్ళు ఎంత కష్టపడితే నేనింతవాణ్ణయాను! అంటాడు.

ఇలాటి ఆలోచన మనుకి ఎందుకుండదని వత్సల బాధపడుతుంది.ఏడాదికొకసారైనా అమ్మా నాన్నలని చూడాలని అనిపించదా వాడికి?సెలవ దొరికినా,ఏ జర్మనీకో,ప్యారిస్ కో, స్విట్జర్లండ్ కో సరదాగా తిరిగి రావటానికి వెళ్తాడు.అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయిట!

ఇల్లు అంటూ ఏర్పాటు చేసుకుంటే అమెరికాలోనే చేసుకుంటానని అంటాడు.అక్కడ ఏ ఊరైనా సరే ఎంతో బావుంటుందిట.కానీ వత్సల ఒప్పుకోదు.ఇండియాలో ఉన్నంత వెరైటీ ఇంకెక్కడా ఉండదంటుంది.కేరళలో పచ్చదనం,ఉత్తరాఖండ్ లోని పర్వతాలూ,మేఘాలయ లోని ఆ ప్రకృతి సౌందర్యం, ఇంకెక్కడుంటాయని అడుగుతుంది.తల్లీ కొడుకులకి ఎప్పుడూ వాదనే!

ఆ రోజు మను తనే ఫోన్ చేశాడు.

మను ,"అమ్మా! ఇంకా ఇక్కడికి వచ్చే విషయం ఆలోచించలేదా?అక్కడ ఏముందని?? ఎక్కడ చూసినా మురికీ ,చెత్తా.  గోండుల కిల్లా శిథిలమైపోయింది.వాళ్ళు మురికివాడల్లో బతుకుతున్నారు.వాళ్ళు  వారానికొకసారి ఊళ్ళోకొచ్చి, పందుంపుల్లలూ ఏవో బెరడులూ అవీ అమ్ముకుని పొట్టపోసుకుంటున్నారు.చూస్తేనే అసహ్యం వేసేట్టుండే మురికి మనుషులు.ఐ హేట్ టు హేవ్ బీన్ బార్న్ దేర్!"అన్నాడు.

"మరి మా ఇద్దరి మాటేమిట్రా?మేమిద్దరం ఉండటంలేదా?"

"అందుకేగా ఫోన్ చేస్తూ ఉంటాను? నా మాట విని ఇక్కడికొచ్చెయ్యండి.నాన్న ఆ పనేదో ఇక్కడే చెయ్యచ్చు."

"మీ నాన్నకి మన ఊరే స్వర్గం.అన్ని దేశాల్లోకీ ఇండియా అంటేనే ఇష్టం.ఇక నాకు ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండటం ఇష్టం.ఈ ఊరితో మాకు ఎన్ని జ్న్యాపకాలు ముడిపడి ఉన్నాయో నీకు తెలీదు."

"సరే అయితే అక్కడే ఉండండి.కొన్ని రోజుల్లో ఒక ఫోన్ కొంటున్నాను,అందులో నా మొహం కనిపిస్తుంది నీకు.మనిద్దరం ఒకరినొకరం చూసుకోవచ్చు."

"ఆ ఫొన్ కనిపెట్టినది ఎవరో ఆసియా వాడే అయిఉంటాడు.కానీ పేరు మాత్రం ఎవడో తెల్లవాడు కొట్టేస్తాడు. బోస్ విషయంలో జరిగినట్టు.అదరికీ మార్కోనీ పేరే తెలుసు,బోస్ ని ఎవరూ తల్చుకోరు!"

మను మాట మార్చాడు,"నీకు ఆ ఊళ్ళో ఉండటం భయంగా లేదా అమ్మా? చుట్టూ కుష్టు రోగులే.నాన్న గ్లవ్స్ కూడా వేసుకోకుండా కుష్టురోగులని ముట్టుకోవటం నేను కళ్ళారా చూశాను!"అన్నాడు.

"ఒరే మనూ, నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించకు.కుష్టు అంటురోగం కాదు.గాంధీ మహాత్ముడూ,బాబా ఆంటే, మదర్ థెరిసా .. వాళ్ళకి ఆ రోగం అంటుకోలేదే?ఒక వేళ ఖర్మ కొద్దీ అంటుకుందే అనుకో,దానికి మందులున్నాయి.మా పెళ్ళయి ముప్ఫై ఏళ్లయింది,రెండేళ్ళకి నువ్వు పుట్టావు.మనకెవ్వరికైనా ఆ రోగం వచ్చిందా?మనింట్లో తోటమాలికి కుష్టు వచ్చి తగ్గింది.నువ్వతని చంక దిగేవాడివేకాదు!"

"షిట్! కాస్త బాగా బతుకుదామంటే ఏమిటేమిటో చెపుతావు!"

"మీ నాన్న ఎప్పుడూ అనే మాటేమిటో తెలుసా?పరిగెత్తి ముందుకుపోవాలన్నది రేసుల్లో పరవాలేదు కానీ, జీవితంలో అందర్నీ కూడగట్టుకుని వెళ్ళాలి అంటారు.త్యాగంలో ఉన్న ఆనందమే వేరు.నోఆ తన నావలోకి మానవ జాతిని మాత్రమే ఎక్కించుకుని తీరం చేర్చలేదు,మనూ!"

"ఏమిటమ్మా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు? అక్కడ ఆనందమా?నవ్వొస్తోంది నాకు."

"అవును రా నీకు సుఖానికీ ఆనందానికీ తేడాయే తెలీకుండా పోయింది."

"తేడా ఏముందసలు?"

"ఉంది...చాలా తేడా ఉంది.సుఖాన్ని డబ్బుతో కొనచ్చు.ఆనందం సంఘర్షణలో,త్యాగంలో,అంకితభావంలో దొరుకుతుంది.కుంగిపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చు.అవిటివాడికి చేయూతనియ్యి.దు:ఖంలో ఉన్నవారిని ఆదుకో,అందులో ఉంది ఆనందం."

"సర్లే,నీ గాంధీ మహాత్ముడు చెప్పిన మాటలేనా ఇవన్నీ? ఇంక ఫోన్ పెట్టెయ్యి..."మను ఫొన్ పెట్టేశాడు.

అప్పుడు మను వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు.వత్సల మాట్లాడేదంతా విన్నాడు.ఆవిడ వచ్చి తన పక్కన కూర్చోగానే ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని,"మనూకి నువ్వు చెప్పేదంతా అర్థంకాదు వత్సలా.వాడు అమెరికనయిపోయాడు.వాళ్ళలాగే అలోచిస్తున్నాడు.వాళ్ళకి డబ్బే ప్రధానం.కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు,కానీ అక్కడికి బంగారం కావలన్న వ్యామోహంతో వెళ్ళిన తెల్లవాళ్ళు వీళ్ళు.ఫాసిజమ్ హిట్లరే తీసుకొచ్చాడంటారు కానీ వీళ్ళు చేసేది మాత్రం ఏమిటి?అంత నిర్దాక్షిణ్యంగా హిరొషిమా,నాగసాకీ మీద దాడులు చేసిన వాళ్ళని ఫాసిస్టులని కాక ఏమనాలి?తాలిబాన్ ని తయారుచేసింది వీళ్ళు కాదూ?వీళ్ళు తయారు చేసిన మిస్సైల్సే కదా ప్రపంచమంతా ఉగ్రవాదులని సృష్టించాయి?ప్రపంచమంతటా వాళ్ళ వస్తువులతో మార్కెట్లు తయారయాయి.అనవసరమైన చెత్తంతా ఈ రోజు మనిషి అవసరమని కొనుక్కుంటున్నాడు.తమ ఫాసిజాన్ని మానవ హక్కులతో పేరుతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు, కానీ స్వభావం మాత్రం అదే, ఏమీ మారలేదు.ఇక్కడి డాక్టర్లూ,ఇంజనీర్లూ,శాస్త్రగ్న్యులూ,అందరూ దూరపుకొండల మాయలో పడి దేశాన్ని అరాజక శక్తుల చేతుల్లో అప్పజెప్పి వెళ్ళిపోతున్నారు. దేశం గురించి ఏంతమాత్రం దిగులుపడకుండా సుఖంగా బతికేస్తున్నారు."

వత్సల ఆలోచనలు ఎప్పుడూ భర్త ఆలోచనలతో కలుస్తాయి.కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది...మను గురించి బాధపడుతూ.

ఒకరోజు ఫోన్ కి బదులు పోస్ట్ లో ఒక పెద్ద కవరొచ్చింది.అందులో కొన్ని కాయితాలతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంది... నేను రంజన అనే అమ్మాయిని పెళ్ళిచేసుకోబోతున్నాను.తన తలిదండ్రులు న్యూజర్సీ లోనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు.రంజన నేను పనిచేసే కంపెనీలోనే కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.వచ్చేవారం ముంబయి నించి మీ ఇద్దరికీ ఫ్లైట్ బుక్ చేశాను.మీరిద్దరూ వస్తే నాకు చాలా బావుంటుంది.మమ్మీ...ప్లీజ్...!

వత్సల మురిసిపోయింది."ఎంతైనా వాడు మనబ్బాయి!వీడి కోరికలు మనం కాకపోతే ఎవరు తీరుస్తారు?"అంది.

చరణ్ సీరియస్ అయిపోయాడు."నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు.నేను రాను.ఒక్కసారి మనకి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు వాడికి!"అన్నాడు.

"మన బాధ్యత మనం నిర్వహిద్దాం!"అంది వత్సల.

"బాధ్యత ఒక వైపే ఉండదు వత్సలా!వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యటంవరకే మన బాధ్యత.ఇప్పుడిక వాడు తన బాధ్యత నిర్వహించాలి.ఎప్పుడన్న ఇక్కడికి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకోండి,అన్నీ నేను చూసుకుంటానని అన్నాడా? అక్కడ నన్ను ప్రాక్టిస్ చెయ్యమనే కదా ఎప్పుడూ వాడనేది?నేను కూడా డబ్బు సంపాదించి పెట్టాలి వాడికి!"

"ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడుకదండీ!"

"అది మనమీద ప్రేమతో కాదు,రంజన తలిదండ్రులు ఏమైనా అనుకుంటారని.ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను,మీ ఉద్దేశం ఏమిటని ఒక్కసారైన అడిగాడా?అడిగితే కాదంటామా?"

భర్త మొహంలో బాధ కనిపించింది వత్సలకి.ఆయన లేచి బైటికెళ్ళాడు.వత్సల పని మమకారం ఒక వైపూ, కర్తవ్యం ఒక వైపూ అన్నట్టు తయారైంది.నిట్టొర్చి,ఆశీస్సులు పంపుతున్నామని ఉత్తరం ముక్క రాసి,ఫ్లైట్ టిక్కెట్లతో కలిపి పోస్ట్ చేసెయ్యాలని నిర్ణయించుకుంది.మర్నాడే ఆ పని చేసేసింది.

మను యశ్రాజ్ కి ఫోన్ చేసి తన తలిదండ్రులు మహా చాదస్తులనీ, టిక్కెట్లు కూడా వెనక్కి పంపేశారనీ ,ఆ దిక్కుమలిన చెత్తా ఊళ్ళోనే ఉండమను అని కోపాన్ని వెళ్ళగక్కాడు.

యశ్రాజ్ మను కి నచ్చజెప్పాడు.నువ్వు ఎవరో పరాయి మనిషి పిలిచినట్టు వాళ్ళని పెళ్ళికి రమ్మని పిలిచావు.వారం రోజుల్లో పాస్ పోర్టూ,వీసా ఎలా రెడీ అవుతాయనుకున్నావు? అని మందలించాడు.

"డేమ్ యువర్ కంట్రీ!మనుషులని టెర్రరిస్టుల్లాగ చూసే ఆ దేశంలో ఏముందని అక్కడ పాతుకుపోయారు?లెట్ దెమ్ లివ్ ఎండ్ డై ఇన్ దేర్ ప్యారడైజ్!ఐ కేర్ ఎ డేమ్ ఫర్ దెమ్!!"

వత్సల చాలాసార్లు కొడుక్కి ఫోన్ చేసింది,కానీ అతను సంబంధం తెంచుకున్నాడు.ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు.భర్త దగ్గర తన బాధ కక్కింది వత్సల,"ఏమిటండీ వీడు? మనరక్తం పంచుకుని పుట్టిన వాడు...!"

చరణ్ నవ్వాడు,"ఆ రక్త సంబంధాలన్నీ రాముడితోనూ దశరథుడితోనూ చెల్లు.కృష్ణుడు చూడు,దేవకి మీదకన్నా యశోద మీదే ప్రేమ ఎక్కువ!నందుణ్ణి తండ్రిలా ప్రేమించలేదూ?"

"అన్నిటికీ ఏదో ఒకటి చెపుతూ ఉంటారు.అవన్నీ మూటకట్టి గంగలో పారెయ్యండి! నా కొడుకు నాకు కాకుండా పోయాడు!"భార్య నోట ఇంత కర్కశమైన మాటలు ఎన్నడూ వినని చరణ్ నిర్ఘాంతపోయాడు.

కానీ మను యశ్రాజ్ కి తరచు ఫోన్ చేస్తూనే ఉన్నాడు."ఏమోయ్ ఐఏఎస్!ఎలా ఉన్నావు? కాశ్మీరు మాత్రమే కాకుండా మిగతా ఊళ్ళమీద కూడా ఉగ్రవాదుల కళ్ళు పడ్డాయిట?అసలు ఈ భూమ్మీద పెరిగిపోతున్న అన్యాయానికి బైటెక్కడినుంచో ఉగ్రవాదులు రానక్కరలేదు.అందరూ లోపలే అవకాశంకోసం చూస్తున్నారు!ఉల్ఫాలూ,నక్సలైట్లూ,సిక్కులూ.అక్కడి నేతలు టిక్కెట్టు దొరక్కపోతే ఎదురుతిరుగుతారు,మరో పార్టీలో చేరిపోతారు, ఇంకా అయితే వాళ్ళే ఒక కొత్త పార్టీ పెడతారు.మీ పోలీసులు నేరస్తులకి దోస్తులు.దుకాణాల్లో అన్నీ నకిలీ వస్తువులే.ఇంక నీలాటి...సివిల్ సర్విసెస్ వాళ్ళు రాజకీయ నాయకుల తోకలు తప్ప మరేమీ కాదు.ఇక్కడ చూడు,ట్రేడ్ టవర్స్ కూలిపోయాక మళ్ళీ బిన్ లాడెన్ ఇటుకేసి చూడగలిగాడా?అదీ అమెరికా!"

అమెరికాలో బ్యాంకు దివాలా తీసింది.ఇండియాలో కూడా స్టాక్ ఎక్స్చేంజి తలకిందులయిందని యశరాజ్ మనుకి చెప్పాడు.మను విసుక్కున్నాడు,"అమెరికా ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని ప్రయత్నిస్తోంది.అందుకోసం పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇంకా ఎన్నో దేశాలకి తమ ఆర్మీనీ,డాలర్లనీ పంపుతోంది.మిగతా దేశాల ఆర్థిక స్థితి సరిగ్గా ఉండాలనే తాపత్రయంతో,తమ దేశపు ఆర్థిక స్థితిని పట్టించుకోటంలేదు,"అన్నాడు.

"కాదు మనూ! సోవియట్ రష్యా ని ముక్కలుచేసాక ఇప్పుడిక ప్రపంచం మొత్తం లో ఏకైక శక్తిగా ఉండాలని ప్రయత్నిస్తోంది అమెరికా.తను తయారుచేసిన తాలిబాన్,పాకిస్తాన్,ఇరాక్ ని అణచిఉంచాలని దాని ప్రయత్నం.మతపరమైన విభేదాలని పోగొట్టాలని కాదు అమెరికా కోరేది,వాటిని మరింతగా పెంచాలనే.అప్పుడే అమెరికాకి లాభం."

"అలా అని నువ్వనుకుంటున్నావు.కానీ అమెరికా మునిగిపోతే నీ దేశం కూడా మునుగుతుంది!"

"నువ్వు పొరబడుతున్నావు మనూ! ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పాతకాలం నాటిది.అమెరికా.యూరప్ లాగా ఇది అంత సులభంగా మునిగిపోదు.మీ నాన్న అనేది నిజమే, పడిపోయే ఫాసిస్టు పైకెదిగే ఫాసిస్టు కన్నా ప్రమాదకరమైనవాడని అంటాడాయన.ఎదుగుతున్న సమయంలో అమెరికా ఒక హిరోషిమా,నాగసాకీలని మాత్రమే నాశనం చేసింది.కొరియా వియెత్నాంలని కాలరాసి వదిలెసింది.కానీ ఇప్పుడు అమెరికా పరిస్థితి దిగజారుతోంది.ఇరాక్,పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ లని పూర్తిగా నాశనం చేసికాని ఊరుకోదు.ఇండియాని కూడా అమెరికా అణచివేసే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యపోవక్కర్లేదు."

"అది నీ ఉద్దేశం,కానీ నిజంకాదు!"

చాలా కాలం పాటు మను ఫోన్ చెయ్యకపోయేసరికి యశరాజ్ తనే ఫోన్ చేశాడు.మను పలికాడు కానీ అతని గొంతులో మునుపటిలా ఇండియా గురించి వ్యంగ్యమూ,అమెరికా గురించి పొగడ్తలూ వినబడలేదు.గద్గదమైన గొంతుతో,"యశ్,ప్రపంచాన్ని బాగుచెయ్యాలన్న ప్రయత్నంలో అమెరికా కూడా సమస్యల్లో చిక్కుకుంది.మా కంపెనీలో కూడా చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు,"అన్నాడు మను.

"రంజన ఉద్యోగం కూడా పోలేదుకదా?"

"లేదు,నా పేరు ఉంది.అప్పుడే చాలా ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టుకున్నాను."

"వెనక్కి వచ్చెయ్యకూడదా మనూ?"

"ఏమిటి యశ్ నువ్వు...?"అని మను ఫోన్ పెట్టేశాడు.

దీపావళికి పట్నంనించి తమ ఊరికి బైలుదేరాడు ,యశ్.వెళ్ళేముందు మనుకి శుభాకాంక్షలు చెప్పాలనిపించి ఫోన్ చేశాడు." దీపావళీ లేదు,మన్నూ లేదు,యశ్!"అన్నాడు మను భారంగా.

"అదేమిటి? అమెరికాలో కూడా మనవాళ్ళు పండగ చేసుకుంటారని విన్నానే?"

"అవును, కానీ నన్ను ప్రస్తుతం చీకట్లు చుట్టుముట్టాయి!"

"ఏమైంది?"

"మునుపు సంపాదించినదాన్లో నాలుగోవంతు జీతానికి మరో కంపెనీ నాకు ఉద్యోగమిచ్చింది.రంజనకి ఉద్యోగం లేదు.ఆ కంపెనీ మూతపడింది."

"రంజన తలిదండ్రులు అక్కడే ఉన్నారుగా, పరిస్థితి బాగుపడేదాకా అక్కడ ఉండచ్చుగా? "

"బాస్టర్డ్స్! వాళ్ళగురించి మాట్లాడకు. దొంగ ఫైనాన్స్ కంపెనీ నడిపేరు లాగుంది,ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇద్దరూ!"

"ఓ! అయితే నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావన్నమాట?"

"అవును,యశ్! ఏంచెయ్యాలో అర్థంకావటంలేదోయ్!"

"ఇండియాకి వచ్చెయ్.నీలాటివాళ్ళకి ఉద్యోగాలకి ఏమీ కొదవలేదిక్కడ.మన దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అంత ఘోరంగా మాత్రంలేదులే."

"నేను కూడా వచ్చేద్దామనే అనుకుంటున్నాను."

"రంజన ఏమంటుంది?తను కూడా వస్తుందిటా?"

"బహుశా రాదెమో! తను విడాకులకి అప్లై చేసింది."

"అదేమిటి?"

"ఒక అమెరికన్ ఏజెంట్ తో ఇదివరకే ఆమెకి అఫైర్ ఉంది."

"అవునా?"

"నువ్వు మా అమ్మా నాన్నకి నచ్చచెప్పగలవా,యశ్?"

"వాళ్ళగురించి బాధపడకు.వాళ్ళు అర్థంచేసుకోగలరు.నువ్వంటే ఇద్దరికీ ప్రాణం!"

దీపావళి తరవాత యశరాజ్ మను తలిదండ్రులని కలిశాడు.అతను చెప్పిన విషయాలు విని వత్సలకి కళ్ళనీళ్ళపర్యంతమైంది."ఇక్కడికి వచ్చేందుకు టిక్కెట్ కి వాడిదగ్గర డబ్బు లేకపోతే మాకు చెప్పు,పంపిస్తాం,"అంది.

"దాన్ని గురించి మీరు బెంగపడకండి."

చరణ్ వీళ్ళ మాటలు మౌనంగా వింటూ ఉండిపోయాడు.కొంతసేపయాక,నెమ్మదిగా,"౧౯౫౦ లోనే రాజ్యాంగంతో బాటు గాంధీజీ చెప్పిన అర్థశాస్త్ర వ్యవస్థని కూడా అమలుచేసిఉంటే మన కుర్రాళ్ళు బైటికి వెళ్ళే అవసరమే రాకపోను!ఈరోజు మొత్తం వ్యవస్థంతా ఇండియాని యూరపులాగ తయారుచేసే ప్రయత్నంలో ఉంది.పొరపాటు ఎక్కడ జరిగింది?"అన్నాడు

యశరాజ్ లోని ఐఏఎస్ జవాబు చెప్పలేదు.అతనికి కారణం తెలుసు,కానీ చెప్పలేడు.గాంధీకీ మార్క్స్ కీ మధ్య పోట్లాట పెట్టి కేపిటలిస్టులు ప్రగతిని దోచ్కుంటున్నారని అతనికి తెలుసు.కేపిటలిస్టులు పాఠాలు నేర్చుకునేది అమెరికా యూరప్ అడుగుజాడల్లో నడిచి.అదికూడా యశరాజ్ కి తెలుసు.కానీ అతనికి తను నిస్సహాయుడని అనిపించింది.

=====================================================================================================

మూలం :హిందీ కథ...విజయ్

అనువాదం : ఆర్.శాంతసుందరి





Friday, April 1, 2011


ఆర్తనాదం
========

శవం కుళ్ళిపోయింది.అవయవాలన్నీ చూసేందుకు వికృతంగా ఉన్నాయి.ఒక వారంక్రితం ప్రాణాలు పోయుంటాయేమో బహుశా.నాకు కబురు ఆలస్యంగా అందింది.నా మంచి కోరేవాళ్ళకి కూడా ఇంత ఆలస్యంగా ఈ సంగతి ఎలా తెలిసిందో!ఎంతో కష్టం మీద, ఎన్నో సమస్యలని ఎదుర్కున్నాక నేను వాళ్ళ సానుభూతిని పొందగలిగాను.ఇంతకు ముందైతే శవం ఎంత దూరాన కనిపించినా వెంటనే నాకు కబురు చేసేవాళ్ళు.

సరే,ప్రస్తుతం భయంకరమైన చావుకి గురైన ఆ శవాన్ని గుర్తించటం అంత తేలికేమీ కాదు.కానీ నా మనసులో ఆయన శరీరంలోని కొన్ని గుర్తులు ముద్రవేసుకుని ఉండిపోయాయి.వాటి ఆధారంతో ఈ శవం తప్పకుండా నా భర్తదే అని నేను కచ్చితంగా చెప్పగలను.రాత్రి డ్యూటీ చేసేందుకు ఇంటినించి ఫ్యాక్టరీ వరకూ ఉన్న నాలుగు మైళ్ళ దూరం ఎప్పుడూ నిర్జనంగానే ఉంటుంది.ఆయన కనపడకుండా పోయిన ఈ అర్నెల్లలో ఇది పన్నెండో శవం.ఇంతకు ముందు కబురందగానే వెళ్ళి పదకొండు శవాలనీ చూసి వచ్చాను.అన్నిటిలోనూ నా భర్త ఆనవాళ్ళు కనిపించి ఆ శవం ఆయనదే అని గట్టిగా చెప్పాను.ఎందుకంటే ఆ పదకొండు శవాల్లోనూ ఒక విషయం సమానంగా కనిపించింది...ఒక్క శవానికీ మొహం పూర్తిగా లేదు.

కానీ నేను గుర్తుపట్టటంలో నా లెక్కన ఎటువంటి పొరపాటూ లేనప్పటికీ,వాటిలో దేనినీ కూడా వాళ్ళు నాకు అప్పగించలేదు.అందరూ నాకు మతిస్థిమితం లేదని అనుకుంటారు...భర్త కనిపించకుండా పోయేసరికి నాకు కొద్దిగా పిచ్చెక్కిందని వాళ్ళ ఉద్దేశం.ఒకే మనిషివి ఇన్ని శవాలు ఉంటాయని నేననటంతో,వాళ్ళ అభిప్రాయం మరింత బలపడుతుంది.పైగా నేను ముత్తయిదువలా,బొట్టూ,పూలూ, మంగళసూత్రం ఏవీ తియ్యకుండా ఉండటం వాళ్ళకి మరీ ఆశ్చర్యం!శవాలని చూసినకొద్దీ నా భర్త మరణించలేదన్న నమ్మకం ఎక్కువవుతోందని వాళ్ళని నమ్మించటం నాకు మరీ కష్టంగా ఉంది.పన్నెండో శవాన్ని చూసేందుకు వెళ్ళినప్పుడు, నా శ్రేయోభిలాషులకి అది కూడా నా భర్తదే అని నేనంటానని నమ్మకం కలిగిపోయింది...నిజంగా నేను కూడా అదే చేశాను.నేను చేసింది తప్పా ఒప్పా,ఈ విషయం నిష్పక్షపాతంగా నిర్ణయించబడాలనే నేను మిమ్మల్ని ఎలుగెత్తి కోరుతున్నాను.

మొట్టమొదటి శవం ఇక్కడికి ఒకటి రెండు మైళ్ళవతల,సువర్ణరేఖ నదొడ్డున,ఒక గోనెసంచిలో మూటకట్టబడి ఉన్నది కనిపించింది.దాన్ని చూడగానే నేను  కెవ్వుమని అరిచాను.శవం ఒంటినిండా కత్తిపోట్లు...సందులేకుండా!నా కళ్ళతో ఇలాటి భయంకరమైన హింస చూడటం నాకిదే మొదటి సారి.శవం రెండు చేతుల గుప్పిట్లూ గట్టిగా మూసి ఉన్నాయి.నా భర్త కూడా ఎప్పుడూ గుప్పిట్లు మూసుకునేవాడు.శవం నల్లరంగులో ఉంది.నా భర్త తెల్లగా ఉంటాడు.కానీ ఫ్యాక్టరీ ఫర్నేస్ ముందు పనిచేసేప్పుడు ఆయన ఒంటి రంగు నల్లగా మారేది.ఆయన ఛాతీ మీద ఒత్తుగా పెరిగిన వెంట్రుకల మధ్య గాయంతాలూకు మచ్చ ఉందన్న సంగతి నాకు మాత్రమే తెలుసు.ఆ మచ్చ ఆ శవం మీద కూడా ఉంది.అందుకే అది నా భర్త శవమని నేను అనటం న్యాయమే అనుకున్నాను.

నేను గుర్తుపట్టిన మరుక్షణం అక్కడికి ఒక వృద్ధ దంపతులిద్దరు వచ్చారు.చేతివేళ్ళూ,మొహంలో మిగిలిఉన్న ఒకేఒక అవయవం ముక్కూ చూసి, అది వాళ్ళ అబ్బాయి శవమని అన్నారు.నిజంగానే శవం ముక్కూ,చేతివేళ్ళూ ఆ ముసలాయనకి కార్బన్ కాపీ లాగే ఉన్నాయి!నేనేం చెప్పినా లాభంలేదని తెలిసిపోయింది.వాళ్ళకా శవాన్ని ఇవ్వకపోతే వాళ్ళు తట్టుకోలేరు.పైగా వాళ్ళబ్బాయి, చదువుకున్న నిరుద్యోగుల సంఘానికి సెక్రటరీ అన్న విషయం కూడా నాకు తెలిసింది. నా భర్త ఫ్యాక్టరీలో విపక్ష యూనియన్ తాలూకు ఉగ్రవాద నివారణ సంఘర్ష సమితికి సెక్రటరీ.

మరయితే మీరే చెప్పండి...అది నా భర్త శవం కాదంటారా?

రెండో శవం ఎనిమిది మైళ్ళవతల,ఒక పేటలో వాటర్ ట్యాంక్ వెనక దొరికింది.దాని చాతీ నిండా తూటాల గుర్తులు.నేనక్కడికి చేరుకునేసరికి ఇంకెవరో మనిషి ఆ శవాన్ని తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆ శవం తన అన్నదని అంటున్నాడతను.అన్యమనస్కంగానే ఆ శవానికీ నా భర్తకీ ఏమైనా పోలిక ఉందా అని వెతుకుతూండగా, ఆశ్చర్యానికి గురయ్యాను.
ఎక్కడైనా అన్యాయం కనబడితే నా భర్త దవడలు అలాగే బిగించేవాడు.శవం పొట్టిగా ఉంది,కానీ నా భర్తతో పరిచయం ఉన్నవాళ్ళు ఆయన పొడుగ్గా ఉండేవాడని మీకు చెపుతారు.కానీ వాళ్ళే ఇంకో సంగతి కూడా చెప్పేవాళ్ళు.అన్యాయాన్ని ఎదిరించి ఓడిపోయినప్పుడల్లా ఆయన ఎత్తు కుంచించుకు పోయెదట!నా భర్తకీ ఈ శవానికీ మరో అద్భుతమైన పోలిక ఉంది- ఈ శవానికి లాగే ఆయనకి కూడా ఎడమ తొడ మీద ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది.ఇక ఈ శవం నా భర్తదే అని అనటం న్యాయమే.

కానీ ఆ రెండో వ్యక్తి,తిరుగులేని రెండు రుజువులు చూపించి ఆ శవం తన అన్నదేనని నిరూపించాడు.అన్నదమ్ములందరికీ బొడ్డు పైకి ఉబ్బి ఉంటుందనీ,ఎత్తుతో పోలిస్తే మణికట్టు చాలా చిన్నదనీ అతను రుజువులు చూపించాడు.ఇక నేనేమంటాను? అయినా కుతూహలం ఆపుకోలేక ఆ చనిపోయిన మనిషి వివరాలు అడిగాను.అవి వినగానే నా బుర్ర తిరిగిపోయింది.అతను కూడా తరచు,మోసగాళ్ళతోనూ,అబద్ధాలకోర్లతోనూ గొడవలు పెట్టుకునేవాడట.మా ఆయన కూడా మరి అంతే!

మీరే చెప్పండి ఆ శవం నా భర్తదని చెప్పటం తప్పా?

మూడో శవం పదిమైళ్ళ దూరాన,జిల్లా సరిహద్దులకి కొంచెం ఇవతల దొరికింది.ముక్కూ మొహం పూర్తిగా పచ్చడైపోయి ఉన్నాయి.గుర్తించటం కష్టమే.కానీ పెద్దపెద్ద కళ్ళు సూటిగా చూస్తున్నాయి...అచ్చం మా ఆయన కళ్ళలాగే.ఆయన ఎప్పుడూ కళ్ళు దించుకుని కాని,చూపులు మరల్చుకుని కాని ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.ఎవరైనా ఆయన్ని బెదిరించాలని చూస్తే ఆ కళ్ళు నిప్పులు చెరిగేవి.శవం బక్కపల్చగా ఉన్న వ్యక్తిది.మా ఆయన్ని తెలిసినవాళ్ళకి ఆయన బొద్దుగా ఉండేవాడని గుర్తుండేఉంటుంది.ఐనా,తప్పనిసరి డ్యూటీకి వెళ్ళేప్పుడు మాత్రం ఆయన రక్తం ఆర్చుకుపోయి,ఒళ్ళు కుంచించుకుపోయేదన్న సంగతి నాకు మాత్రమే తెలుసు.నా భర్తకి లాగే ఈ శవానికి కూడా  అరచేతులు బాగా ఒరుసుకుపోయి బండగా ఉన్నాయి.ఈ శవం నా భర్తదేనని నేను ప్రకటించచ్చు అనుకున్నాను.కానీ ప్రతిసారీ జరిగినట్టే ఈసారి కూడా ఇంకెవరో ఇది మాదంటూ వచ్చారు.వాళ్ళు కుటుంబసభ్యులతో వచ్చారు.అందరి మొహాల్లోనూ బోలెడంత నమ్మకం కనిపించింది.

అంతమందినీ తప్పని నిరూపించటం నాకు కష్టమైపోయింది.పోయిన వ్యక్తి గుణగణాల గురించి, అతనెంత దయాగుణం కలవాడో,ప్రేమకి ప్రతిరూపంలా ఎలా ఉండేవాడో ,ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి ఎలా సాయం చెసేవాడో చెపుతూంటే,నేను అవాక్కయి వినసాగాను.వాళ్ళు చెపుతున్నది తమ బంధువు గురించా లేక నా భర్త గురించా అన్న అనుమానం కలిగింది.

మీరే చెప్పండి ఇది నా భర్త భౌతిక దేహమని నేనెలా అనకుండా ఉంటాను?

నదిలో కొట్టుకొచ్చి ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో దక్షిణాన ఉన్న ఒక ఊళ్ళో ఒడ్డుకు చేరిన ఒక శవం గురించి నాకు కబురు అందింది.ఆయన కనబడకుండా పోయాక ఇది నాలుగో శవం.తలా,మొహం పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి.పొడుగాటి మెడా,నీళ్ళలో నాని ఉబ్బిపోయిన ఛాతీ చెక్కుచెదరలేదు.దాన్ని జాగ్రత్తగా గమనించాక ఇది నా భర్తదే అని చెప్పాలని నిర్ణయించుకున్నాను.కానీ నాకూడా వచ్చినవాళ్ళు ఒప్పుకోలేదు.నా భర్త మెడ పొట్టిగా లావుగా ఉంటుందని వాదించారు.ఆకాశంవైపుకి ఎప్పుడు తలెత్తి చూసినా,లేక దూరంగా ఉన్న దేన్నైనా గురిచూడాలన్నా ఆయన మెడ పొడుగ్గా సాగేదని ఎలా వాళ్ళని నమ్మించటం?

నేనీ శవం మీద నా హక్కుని తెలియచేసేలోపలే,ఇంకెవరో వచ్చి అది తన బంధువుదని అంటారని ఎదురుచూశాను.సరిగ్గా అలాగే జరిగింది.పెద్దచప్పుడుతో ఒక పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడ ఆగింది.దాన్లోంచి పోలీసులు దిగి శవం ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.చివరికి అది క్రితం రాత్రి అపహరించబడ్డ ఒక లోకల్ మంత్రిదని తేల్చారు.ఆ మంత్రి చాలా నిజాయితీ గలవాడనీ, ప్రజలకోసం కష్టపడతాడనీ,అవినీతినీ అక్రమాలనీ సహించడనీ చెప్పుకుంటారు.అసెంబ్లీ మళ్ళీ సమావేశమైనప్పుడు, భుజబలంతో కొట్టుకొస్తున్న ఒక మంత్రి బండారం బైట పెట్టబోతున్నాడనీ, అందుకని అతనికి చాలా రోజులనించీ బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

మరీ విడ్డూరంగా ఉందే! వీళ్ళంటున్నది నా భర్త గురించే!ఫ్యాక్టరీలో జరిగే మోసాలూ,అక్రమాల గురించి ఆయనెప్పుడూ క్షోభ పడుతూ ఉండేవాడు.కార్మికులందర్నీ కూడగట్టుకుని, అలాటివాళ్ళ గుట్టు రట్టుచేస్తానని ప్రకటించేసరికి, ఆయనకి బెదిరిస్తూ ఫోన్లూ, ఉత్తరాలూ రాసాగాయి.

మరి ఈ శవం మా ఆయనది కాదని అనగలనా? మీరే చెప్పండీ!

మా ఇంటి నించి మైలు దూరంలో దొరికిన శవానికి తల లెదు!  శవంలోని కొన్ని భాగాలని జంతువులూ పక్షులూ పీక్కు తినేశాయి.అయినప్పటికీ ఒకే మనసు రెండు తనువులుగా బతికాం కాబట్టి,నేను నా భర్తలోని కొన్ని లక్షణాలని గుర్తుపట్టగలిగాను!ఆయన తన గోళ్ళు ఎప్పుడూ కత్తిరించుకునేవాడు కాదు.వాటిని ఆయుధాల్లాగ కాపాడుకునేవాడు.ఆయన అరికాళ్ళు పగుళ్ళతోనూ,గాయలతోనూ నిండి ఉండేవి.డ్యూటీ చేశాక చెప్పుల్లేని కాళ్ళతో నడవటం ఆయనకి అలవాటు.బైటికి కూడా అలాగే వెళ్ళేవాడు.రాళ్ళూ రప్పలూ మనకి సమస్యలని ఎలా ఎదుర్కోవాలో అలవాటుచేసే ఆయుధాలని అనేవాడు.అంతేకాక,అలా ఉత్తి కాళ్లతో నడవటం వల్ల,మట్టి స్పర్శ తగిలి,మనలో కూడా నేలతల్లి అంటి ఓర్పూ,సహనమూ అలవడతాయనీ,మట్టిలోని సారవంతమైన గుణం మనలో వచ్చి చేరుతుందనీ నమ్మేవాడు.నేను శవాన్ని గుర్తుపట్టి,మావాళ్ళు నాకు వత్తాసు పలికేలోపల అక్కడికి ఒక పెద్ద గుంపు వచ్చింది.వాళ్ళు చాలా లోతుగా అన్ని విషయాలూ పరీక్షించి,ఆ శవం తమదేనని ఘంటాపధంగా చెప్పేశారు.శవం తమ ఊళ్ళోని ఒక అనాథ యువకుడిదనీ, వ్యవస్థని నిర్భయంగా ఎదిరిస్తూ,అందరికీ పక్కలో బల్లెంలాగ తయారయాడనీ,దళితులూ,పీడితులూ,పేదవాళ్ళతరఫున వాళ్ళ ఆర్తనాదాలని విద్రోహంగా మార్చే ప్రయత్నం చేస్తూ ప్రజలకి ఎంతో ప్రియమైన వ్యక్తిగా తయారయ్యాడనీ.తనగురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా ఇతరుల కోసమే జీవించటం అతనికి ఆనందమనీ,అతను ఎప్పుడు ఎక్కడ వెనక్కి తిరిగి చూసినా, ఒక పెద్ద గుంపు ఆర్తనాదాలూ, కేకలతో కనిపించేదనీ,విద్రోహం అతని వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిందనీ వాళ్ళు చెప్పుకొచ్చారు.తుఫానులూ,మాడ్చే ఎండలూ,లోకంలో ఎదురయ్యే  నేలా తలమీద ఆకాశం లేని వాళ్ళంతా తలదాచుకునేందుకు అతనిమీదే ఆధారపడసాగారు.సుడిగాలులూ, తుఫానులూ,మాడ్చే ఎండలూ,ఈ లోకంలోని మనుషుల నిర్దయతో కూడిన ప్రవర్తనా,మొదలైన చెత్తా చెదారంలోంచి పుట్టగొడుగులా భూమ్యాకర్షణ శక్తిని సవాలు చేస్తున్నట్టు తలెత్తుకుని నిలబడసాగాడు.అందుకే వ్యవస్థని పోషించే శక్తులు అతన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి.

మీకు నమ్మకం కలగపోవచ్చు కాని, నా భర్తలో కూడా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.ఇలాటి అగ్గే ఆయనలోనూ ఎప్పుడూ మండుతూ ఉండేది.తన జీతాన్ని ఎవరెవరికో ధారాదత్తం చేసేశేవాడు.రేపెలాగ అని ఆలోచించటమే ఆయనకి ఇష్టముండేది కాదు.తన రేపు _ క్షణక్షణం అయోమయమైన భవిష్యత్తు అనే సుడిగుండంలో మెడలోతున చిక్కుకున్న అన్ని లక్షలమంది రేపుకి _ విరుద్ధంగా ఎందుకుండాలని ఆయన అనేవాడు. చిరుగులుపట్టి మాసిపోయిన నా బట్టలు చూడండి,పడిపోయేట్టున్న నా ఇంటిని చూడండి...మీకే తెలుస్తుంది.

చెప్పండి, ఈ శవం మీద నాకు హక్కుందని చెప్పటానికి ఇంకేమి రుజువులు కావాలి?

నా వాదనని ఇలా చాంతాడులా ఇంక పెంచదలచుకోలేదు నేను.తరవాత ఆరు శవాల విషయంలో కూడా నాకు ఇలాటి అనుభవాలే ఎదురయ్యాయి.అన్ని శవాలూ,మనిషిలోని ఆటవిక ప్రవృత్తికీ, క్రూరత్వానికీ పరాకాష్ఠగా కనిపించాయి.నా ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగింది.ఒంట్లోని రక్తమంతా, ఎముకలూ మాంసంతో సహా,కన్నీళ్ళరూపంలో కారిపోయినట్టనిపించింది.నేనొక కన్నీటి చారికగా మిగిలిపోయానని చూసినవాళ్ళందరూ అంటున్నారు.

ప్రస్తుతం నేను అక్రమాల పడవలో ఎక్కి,దుఃఖాల సముద్రంలో సుడిగూండాల మధ్య  చిక్కుకుని ప్రయాణం చేస్తున్నాను.నావ మునుగిపోయేముందు బహుశా ఇదే నా ఆఖరి ఆర్తనాదమేమో!పన్నెండో శవాన్ని చూసే చిత్రహింసకి గురి చేస్తున్నారు నన్ను.ఈ శవం పూర్తిగా కుళ్ళిపోయి దుర్గంధంతో నిండి ఉంది.ఊళ్ళోవాళ్ళు దాన్ని  కాకులూ,రాబందులూ,కుక్కలూ నక్కలూ పీక్కు తినకుండా దానిమీద తాటాకులు కప్పారు.ప్రాణంతో ఉన్నప్పుడు శరీరం మీద ఎంత ఘోరమైన,క్రూరమైన దాడులు జరిగినా పట్టించుకోని మనుషులకి శవాన్ని చూడగానే ఎందుకనో మనసు కరుణతో నిండి పోతుంది!బహొశా మనసు లోతుల్లో, జీవితం సారహీనంగా ఉండటం గురించీ, పరలోకం గురించీ ఆలోచనలు చుట్టుముడతాయేమో!

మిగతా శవాల గురించి నెను చెప్పినలాంటి లక్షణాలే ఈ శవాం విషయంలో కూడా కనిపించింది. శవం నోరు తెరుచుకుని ఉంది.నా భర్త కూడా అన్యాయాన్ని చూస్తే నోరుమూసుకుని ఉండలేకపోయేవాడు.ఈ శవం మాదని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు.అది అనాథ శవం.మేలుకోరేవాళ్ళమని చెప్పుకుంటూ నా వెనక తమాషా చూసేవాళ్ళందరూ కలిసి,శవాన్ని తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్ట్ మార్టం అవీ చేయించటానికి మేం పోలీస్ స్టేషనుకి వెళ్ళాల్సివచ్చింది.

పోలీసులు శవాన్ని చూస్తూనే ఎదో ఆలోచనలో పడ్డారు.వాళ్ళ నుదుటిమీద ముడతలు పడ్డాయి.ఎన్నో పోలీస్ స్టేషన్లలో ఉద్ధార్ సింగ్ అనే దోపిడీ దొంగ ఫొటోలు ఉన్నాయి...అతనికీ ఈ శవానికీ వాళ్ళకి పోలికలు కనిపించాయి.ఉద్ధార్ సింగ్ ని బతికుండగా కాని, చనిపోయాక గాని పట్టుకున్నవాళ్ళకి లక్ష రూపాయల బహుమానం ప్రకటించబడింది.పోలీసులు తమ ఫైల్లోంచి ఆ దోపిడీ దొంగ ఫొటోలని బైటికి తీసి శవం మొహంతో పోల్చి, ఇది వాడి శవమేనని నిర్ధారించారు.

ఉద్ధార్ సింగ్ గురించి పోలీసులకి బాగా తెలుసు.వాడు డబ్బున్నవాళ్ళని దోచుకుని పేదలకి దానం చేసేవాడు.నేరప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ వాడికి దళితులన్నా,పీడితులన్నా, పేదలన్నా వల్లమాలిన జాలి.వాళ్ళకి అతనే దేవుడు.అవినీతినీ అక్రమాలనీ ఎదుర్కొనే మిత్రుడు.దేశాన్ని పాలించే నేతలని హెచ్చరిస్తూ వాడు గోడలనిండా పోస్టర్లు అతికించేవాడు...వెంటనే మీ వైఖరిని మార్చుకున్నారా సరే,లేకపోతే మీ అంతుచూస్తాను! అని ఆ పోస్టర్లమీద రాసేవాడు.

మా ఆయన కూడా ఫ్యాక్టరీలో కార్మికుల పక్షం వహించి యజమానులతో ఇలాటి పోరాటాలే చేసేవాడని చెప్పనవసరం లేదనుకుంటాను.ఆయన కనపడకుండా పోవటం వెనక ఇలాగే ఏ శక్తులో ఆయన్ని మట్టుపెట్టినవాళ్ళకి పెద్ద మొత్తాన్ని ఎర చూపి ఉంటాయి.

మరి చెప్పండి ఈ శవాన్ని మా ఆయనదిగా గుర్తించి తప్పు చేశానా?

ఈ విధంగా ఆరు నెలల్లో పన్నెండు ఘోరాతిఘోరమైన హత్యలు!కానీ నాకు దొరికిందేమీ లేదు.ప్రతిసారీ దుఃఖం వెల్లువై పొంగి పొర్లేది.నేను వితంతువునో  సుమంగళినో తెలీని స్థితి...ఆ సంధిరేఖ మీద తదబడుతూ!నా భర్త బతికిలేడని నాకు తెలుసు.అలాగే ఆయన వదిలివెళ్ళిన అడుగుల చప్పుడూ,మంచి గుణాల సువాసనా ఎప్పటికీ చనిపోవని కూడా నాకు తెలుసు.పన్నెండు కాదు లక్ష శవాలు చూసినా అది మాత్రం మారదు.

సోదర సోదరీమణులారా,మీరు న్యాయం,పోరాటం పక్షాన ఉన్నట్టయితే నాదొక మనవి...మీ చుట్టుపక్కల అనాథ శవమేదైనా కనిపిస్తే...దాని రంగూ,ఆకారం,ఎత్తూ ఏదైనప్పటికీ,ఆ శరీరంలోంచి,మంచితనం,ఆత్మగౌరవం,నిజాయితీ తాలూకు సుగంధం వస్తున్నట్టయితే,ఆ శవం మాదని చెప్పే వారసులెవరూ రాకపోతే,అది తప్పకుండా నా భర్తదే అని గ్రహించండి.ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నాకు కబురందించండి.మీరు నాకెంతో ఉపకారం చేసినవారవుతారు!

*******************************************************************************************************************************

హిందీ మూలం : జయనందన్

అనువాదం :ఆర్.శాంత సుందరి









చరిత్ర
=======
            - సంజీవ్

    
                                                                                                    
                                            మసక బారిన ఆ చరిత్ర పుటల్లో ఏమి రాసిఉందో, ఎవరికీ సరిగ్గా తెలీదు, కానీ చెప్పే ప్రతివాడూ తను చెప్పేదే నిజమని బల్లగుద్ది చెపుతాడు.మొత్తం విషయమంతా తెలుసుకోవాలంటే , కథ మొత్తం విప్పాల్సి వస్తుంది.ఇంత గందరగోళంలో చిక్కుకుని , నలిగి, అరిగి , వంకరలు తిరిగిపోయిన దీన్ని ఒక్కొక్క పొరే విప్పుతూ , ఒక్కొక్క అక్షరాన్నీ పేర్చి చదవాలి.ఆ తరవాత అర్థం చేసుకోవాలి, అప్పటికి ఏమైనా అర్థం అవుతుందేమో చూడాలి.కానీ ఇక్కడ కూడా ప్రమాదం లేకపోలేదు , ఒక చిన్న విత్తనం చుట్టూ దుబ్బులాగ బోలెడంత అపోహలు పెరిగిపోయి ఉంటాయి. నిజం! నిజాన్ని ఎవరైనా ఎప్పుడైనా పూర్తిగా తెలుసుకో గలిగారా!
                                               కాదు కాదు ,ఇది మొహెంజదారో హరప్పా కి సంబంధించిన విషయం కాదు భాయీ ! ఇది బిలౌనా అనే పల్లె సంగతి.ఐదు వేల ఏళ్ళ కిందట జరిగింది కాదు  ఒక యాభై అరవై ఏళ్ళ కిందటి సంఘటన.
                                         అప్పుడు మనని బ్రిటిషు వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు.ఈ ప్రాంతాల కొన్నేళ్ళ క్రితమే రైలుబండి  వెళ్ళడం మొదలుపెట్టింది.ఆవిరింజను భుగభుగమని పొగలు కక్కేది. ఛుక్ ఛుక్...పీ పీ...అంటూ పరిగెత్తేది.ఇక బిలౌనా పాట్నా హౌరా ఏమీ కాదు కదా అక్కడ ఆగేందుకు? బిలౌనా జనం డాబుగా పంచె కొస ఒక చేత్తో పట్టుకుని విలాసంగా మీసాలు మెలేస్తూ ప్రయాణం చేసేందుకు?

                                       ఈ రైలు బిలౌనా జనం గుండెలదిరేట్టు ధన్ ధన్ మంటూ తమ ఊరిమీదుగా వెళ్ళిపోతూంటే వాళ్ళకి అంతకన్న పెద్ద అవమానమేం కావాలి? రెండు వైపులా పంట పొలాలలో కనుచూపు మేర వరకూ గంగ నీళ్ళు. రైలుకట్ట కట్టేందుకు అటూ ఇటూ ఉన్న పొలాలని తవ్వేసి మట్టి తోడే్శారు. వాళ్ళ నేల , వాళ్ళ పొలాలు . రైలు వాళ్ళ గుండెల మీదినించి పరిగెత్తడం చూస్తే బిలౌనా తన ఒంటికి ఎక్కడ తగులుతుందో నని పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి.రైలు పట్టుకోవాలంటే ఒక కోసు దూరం ముందుకో వెనక్కో వెళ్ళవల్సిందే. స్టేషన్లు అక్కడే ఉన్నాయి మరి.
                                         ఇంకే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా బిలౌనా లో స్టేషన్ ఉండాలనే విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీదున్నారు.ఇది ఒక్క బిలౌనా వాళ్లే కాదు , హాథీ పేట ,జానకీ దహ్,ఇస్లామైల్పుర్, శామ్యూల్ గంజ్ తో సహా పాతిక ఊళ్ళు , రైలుకట్టకి అటూ ఇటూ ఉన్నవి, స్టేషన్ కావాలని అనుకున్నాయి. ఇంక ఒకటే హడావిడి మొదలైంది. చందాలు పోగయాయి,
ఎందరి కాళ్ళో పట్టుకోవలసి వచ్చింది,సంతకాలు సేకరించేందుకు బోలెడన్ని కాయితాలు ఖర్చయిపోయాయి....కానీ చివరికి మిగిలింది నిరాశే.

                                                      మూడేళ్ళు ఇదే విధంగా గడిచిపోయాయి.అప్పుడు అందరికీ కబురంపి ఒక చోట చేర్చారు. ఇప్పుడిక ట్రైన్ ని (రైలు కి ఈ కొత్త పెరు వాళ్ళకి తెలిసిపోయింది) , బిలౌనా లో ఆపించాల్సిందే .మంచిగా ఆపకపోయినట్టైతే ఇంకో మార్గంలో...అంటే బలవంతంగా ... ఆపిస్తామని నిర్ణయించారు.
                                     " ఆపేందుకు ఎవరెవరు వెళ్తారు? " ఒకరికి సందేహం వచ్చింది.
                                    "అందరం వెళ్ళాలి."
                                    "ఎప్పుడు?"
                                   " ఇవాళ్టికి మూడు నెలల తరవాత , సూర్యభగవానుడు ఉత్తరాయణానికి చేరుకున్నప్పుడు ,మంచిరోజు చూసుకుని .వాళ్ళకి ముందుగా హెచ్చరిక పంపాలి , మూడు నెలెల లోపల రైలు మన ఊళ్ళో ఆగేట్టు చెయ్యకపోతే మనం గాంధీ మహాత్ముడిలా సత్యాగ్రహం చేస్తామని బెదిరించాలి."
                                   చూస్తూండగానే తొంభై రొజులూ గడిచిపోయాయి. ఇక పాతిక ఊళ్ళలోనూ దండోరా వేయించారు. " వినండోహో...ఇది మనందరి ఆత్మగౌరవానికీ సంబంధించిన సమస్య.ఆడా మగా అందరికీ తెలియజేసేదేమనగా బినౌలా లోని పాత రావి చెట్టు కిందికి అందరూ రావలసిందని మనవి. ట్రైను ఆపడం విషయమై ఆలోచించేమ్దుకు అందరూ రావాలొహో...!"
                                    "చావడానికా?"
                                   "అబ్బా ,నీ దుంపతెగా ! గాంధీ గారి సత్యాగ్రహం చావదానికిట్రా?"
                                  "కానీ బ్రిటిషు దొరలు సత్యాగ్రహం చేస్తామంటే వింటారా?"
                                 "ట్రైను డ్రైవరు నలురైదుగురు నిలబడి ఉండటం చూస్తే ఆపకపోతాడంటావా?మనమీంచి రైలు పోనిస్తాడా?"
                                 " ఒక వేళ అలా పోనిస్తే? అప్పుడేం చేస్తాం? మేము మేకల్లాటి వాళ్ళం మే ... మే... అంటూ చచ్చి ఊరుకుంటాం ! మీకేం పులులు మీరు , తప్పించుకుంటారు."  
                                "బ్రిటిషు రాజ్యం లో పులీ మేకా ఒకే చెరువులో నీళ్ళు తాగుతాయి!"
                                                           ఇంకేముంది, అన్ని అనుమానాలూ , సందేహాలూ తీరాక , పులులూ మేకలూ ఒకే  ఒడ్డున గుమిగూడాయి. ఒడ్డు అంటే రైల్వే లైన్.పట్టాలు ఊరి జనంతో నిండిపోయాయి రైలు అర్ధరాత్రి వస్తుంది.దాని హెడ్ లైట్ దూరం నించే నక్షత్రం లాగ కనబడుతుంది.దగ్గరైనకొద్దీ పెద్దదౌతుంది.జనం మాటి మాటికీ అటుకేసి చూస్తున్నారు , కానీ నక్షత్రం కాదుకదా , చిన్న మిణుగురు కూడా కనబడ లేదు.అన్నివైపులా చిమ్మచీకటి.కుంటి గజాధర్ ఉండుండి పట్టాల మీద చెవి ఆనించి విని , ఇంకా రైలు రావడం లేదని చెపుతున్నాడు.
                            "ఎంత దూరంలో ఉంది?" అని అడిగారెవరో.
                            "ఛట్ ఉండరా , వాణ్ణి విననీ...మధ్యలో మాట్లడక." కసురుకున్నారు మిగిలిన జనం.
                           అరగంట అలా ప్రయత్నించాక  గజాధర్ కి రైలు చప్పుడు దూరంగా వినిపించింది. "వస్తోంది , సిద్ధంగా ఉండండి..."అని హెచ్చరించాడు.అది అంచలంచలుగా అందరికీ చేరింది.


                                   మూడేళ్ళు ఇదే విధంగా గడిచిపోయాయి.అప్పుడు అందరికీ కబురంపి ఒక చోట చేర్చారు. ఇప్పుడిక ట్రైన్ ని (రైలు కి ఈ కొత్త పెరు వాళ్ళకి తెలిసిపోయింది) , బిలౌనా లో ఆపించాల్సిందే .మంచిగా ఆపకపోయినట్టైతే ఇంకో మార్గంలో...అంటే బలవంతంగా ... ఆపిస్తామని నిర్ణయించారు.
                                     " ఆపేందుకు ఎవరెవరు వెళ్తారు? " ఒకరికి సందేహం వచ్చింది.
                                    "అందరం వెళ్ళాలి."
                                    "ఎప్పుడు?"
                                   " ఇవాళ్టికి మూడు నెలల తరవాత , సూర్యభగవానుడు ఉత్తరాయణానికి చేరుకున్నప్పుడు ,మంచిరోజు చూసుకుని .వాళ్ళకి ముందుగా హెచ్చరిక పంపాలి , మూడు నెలెల లోపల రైలు మన ఊళ్ళో ఆగేట్టు చెయ్యకపోతే మనం గాంధీ మహాత్ముడిలా సత్యాగ్రహం చేస్తామని బెదిరించాలి."
                                   చూస్తూండగానే తొంభై రొజులూ గడిచిపోయాయి. ఇక పాతిక ఊళ్ళలోనూ దండోరా వేయించారు. " వినండోహో...ఇది మనందరి ఆత్మగౌరవానికీ సంబంధించిన సమస్య.ఆడా మగా అందరికీ తెలియజేసేదేమనగా బినౌలా లోని పాత రావి చెట్టు కిందికి అందరూ రావలసిందని మనవి. ట్రైను ఆపడం విషయమై ఆలోచించేమ్దుకు అందరూ రావాలొహో...!"
                                    "చావడానికా?"
                                   "అబ్బా ,నీ దుంపతెగా ! గాంధీ గారి సత్యాగ్రహం చావదానికిట్రా?"
                                  "కానీ బ్రిటిషు దొరలు సత్యాగ్రహం చేస్తామంటే వింటారా?"
                                 "ట్రైను డ్రైవరు నలురైదుగురు నిలబడి ఉండటం చూస్తే ఆపకపోతాడంటావా?మనమీంచి రైలు పోనిస్తాడా?"
                                 " ఒక వేళ అలా పోనిస్తే? అప్పుడేం చేస్తాం? మేము మేకల్లాటి వాళ్ళం మే ... మే... అంటూ చచ్చి ఊరుకుంటాం ! మీకేం పులులు మీరు , తప్పించుకుంటారు."  
                                "బ్రిటిషు రాజ్యం లో పులీ మేకా ఒకే చెరువులో నీళ్ళు తాగుతాయి!"
                                                           ఇంకేముంది, అన్ని అనుమానాలూ , సందేహాలూ తీరాక , పులులూ మేకలూ ఒకే  ఒడ్డున గుమిగూడాయి. ఒడ్డు అంటే రైల్వే లైన్.పట్టాలు ఊరి జనంతో నిండిపోయాయి రైలు అర్ధరాత్రి వస్తుంది.దాని హెడ్ లైట్ దూరం నించే నక్షత్రం లాగ కనబడుతుంది.దగ్గరైనకొద్దీ పెద్దదౌతుంది.జనం మాటి మాటికీ అటుకేసి చూస్తున్నారు , కానీ నక్షత్రం కాదుకదా , చిన్న మిణుగురు కూడా కనబడ లేదు.అన్నివైపులా చిమ్మచీకటి.కుంటి గజాధర్ ఉండుండి పట్టాల మీద చెవి ఆనించి విని , ఇంకా రైలు రావడం లేదని చెపుతున్నాడు.
                            "ఎంత దూరంలో ఉంది?" అని అడిగారెవరో.
                            "ఛట్ ఉండరా , వాణ్ణి విననీ...మధ్యలో మాట్లడక." కసురుకున్నారు మిగిలిన జనం.
                           అరగంట అలా ప్రయత్నించాక  గజాధర్ కి రైలు చప్పుడు దూరంగా వినిపించింది. "వస్తోంది , సిద్ధంగా ఉండండి..."అని హెచ్చరించాడు.అది అంచలంచలుగా అందరికీ చేరింది.


                                                                             తలపాగాలు కట్టుకున్నారు. కాగడాలు వెలిగించి పట్టుకున్నారు. ధోవతులు కట్టుకుని , కాశెలు బిగించారు. మరోపక్క ఆడవాళ్ళ ధైర్యం దెబ్బతింది.వాళ్ళు ఏడవడం మొదలెట్టారు.కొందరైతే శోకాలు పెట్టసాగారు.సిర్జుల్ హక్ ఆడవాళ్ళనీ , పిల్లలనీ రైలుకట్టకి దూరంగా తీసుకుపొమ్మని , హర్జిందర్ బాబా కి చెప్పాడు.బలీ కీ జైఇంతలో హెడ్ లైటు కనిపించింది.ఛుక్ ఛుక్ అనే చప్పుడు కూడా దగ్గరవసాగింది.వాతావరణం వేడెక్కింది." బజరంగ్ బలీ కీ జై... కాళీ మాతకి జై ...యా అలీ...ఏసుక్రీస్తు మమ్ము కాపాడుగాక..." అంటూ ప్రతిఒక్కరూ తమ తమ దేవుళ్ళని ప్రార్ధించసాగారు . కొంతసేపటికి ఆ దేవుళ్ళందరూ కలగలిసిపోయారు.
                                                                           ఇంజను కూత పెడుతూ ముందుకి వస్తోంది.... పీ....పీ...తొలగండి...దారివ్వండి....పీ...అంటున్నట్టు ! జనంలోనుంచి కేకలు మొదలయ్యాయి... మేం కదలంగాక కదలం...ట్రైను ఇంకా ఇంకా దగ్గరవసాగింది. జనం గుండెల్లో రైళ్ళు పరిగెత్తసాగాయి. " ఓర్నాయినో ! మీదిమీదికొచ్చేస్తోందేంటిరా దీని దుంపతెగా!! అగదా ఏమిట్రా? ఒరే పరిగెత్తండిరా...గజధర్...షమ్సుల్...ఫిలిప్పూ...పారిపోదాం రండర్రా... రైలు అదే వేగంతో దడదడ మంటూ వెళ్ళిపోయింది. గొంతులన్నిటినీ నొక్కేస్తూ...చక్రాలకింద నలిపేస్తూ ...వెళ్ళిపోయింది.ఆఖరి క్షణామ్ లో తప్పించుకో గలిగినవాళ్ళు తప్పించుకున్నారు. లేనివాళ్ళు బండికింద పడి ముక్కలు ముక్కలై చనిపోయారు.ఆ చీకట్లో శోకాలు పెడుతూ మిగిలినవాళ్ళు తమవాళ్ళ శవాలని కాగడాల వెలుతుర్లో వెతకసాగారు.తెల్లవారే వరకూ వెతుకుతూనే ఉన్నరు. శవాల ముక్కలు ఎన్నో ఫర్లాంగుల వరకూ విసిరివేయబడ్డాయి.
                                                                          డాక్టర్లు వచ్చారు , సిపాయిలు వచ్చారు." ఎవరెవరు చనిపోయారు? ఎందరు? ముగ్గురా?"
                                                                          " అబద్ధం ! ముగ్గురు కాదు , ముఫ్పై మంది... ఇరవై ఏడు మంది శవాలే దొరకలేదు.!"
                                                                           ముగ్గురో ముఫ్పైమందో , ఏదైతేనేం? వాళ్ళ ప్రాణాలు పోవడం వల్ల ఒక రకంగా మంచే జరిగింది. ట్రైను అక్కడ ఆగసాగింది.ఇవాళ చిన్న ప్యాసెంజరు ఆగుతోంది , రేపు మైలు కూడా ఆగుతుంది , అనుకున్నారు ఊరి జనం.స్టేషిన్లో ఒక బోర్డు పెట్టారు... " ఫలానా తేదీన బినౌలా లో రైలు ఆపించడం కోసం తమ ప్రాణాలర్పించారు."
                                                                          ఏళ్ళు గడిచాయి. తెల్లదొరలు దేశాన్ని వదిలి పోయారు.నల్లదొరలు వచ్చారు. రాగానే బోర్డు మార్పించేశారు.ముగ్గురు అని ఉన్న చోట ముఫ్పై మంది అని రాయించారు.వాళ్ళందరి పేర్లూ, వయసూ ,కులం , ఊరి పేరూ నమోదు అయాయి. ఆ బోర్డు ఇలా పెట్టారో లేదో పెర్ల గురించి అభ్యంతరాలు మొదలయాయి....బుధచక్ కి చెందిన పరమేశ్వర్ పేరు లేదు...శివపుర్ దులారే పేరు ఎందుకు లేదు? ఇస్లాంపుర్ ఇలియాస్ పేరూ ,అర్మాన్ పేరూ నమోదు కాలేదేం?శామ్యూల్ గంజ్ మనిషి ఒక్కరి పేరు కూడా ఇందులొ లేదు ! ఇక ఆడవాళ్ళ గోల మరోవైపు...ఒక్క స్త్రీ పేరు కూడా చేర్చలేదేమ్ అంటూ గొడవ చేశారు.ఆడవాళ్ళెవరూ చనిపోలేదా? అని సవాళ్ళు. పేర్ల గురించి విచారించవలసిందంటూ అర్జీలు పెట్టుకున్నారు. కమిటీలని ఏర్పాటు చేశారు.
                                                                       మరో వైపు బినౌలా కి చెందిన కవి సురాజీ అమరులైన వాళ్ళని పొగుడుతూ ఒక కవిత రాశాడు. స్వాతంత్ర్యదినం రోజున ప్రతి ఏడూ ఆ పాటనే జనం పాడసాగారు.అది అలా అలా జనం నోళ్ళలొ నాని ఒక హరికథ లాగ మారిపోయింది. తద్దినాలలో కూడా చోటు చేసుకుని ఒక బిలౌనా లోనే కాక చుట్టుపక్కల గ్రామాలన్నిట్లోనూ ప్రసిద్ధి పొందింది.
                                                                        మరికొన్నేళ్ళు గడిచాయి.జానకీదహ్ లోనూ హాథీపేట్ లోనూ పాతకాలం నాటి భూమి గంగ గర్భంలోకి వెళ్ళిపోయింది. కానీ నదిలోనుంచి కొత్త భూభాగం బైట పడింది.దాన్ని కబ్జా చెసేందుకు పెద్దెత్తున పోటీ ప్రారంభమైంది.కులాల కుమ్ములాటలూ , ఊళ్ళమధ్య కొట్లాటలూ , లాఠీలూ , తుపాకులూ... చరిత్రలో చీలిక ఏర్పడింది.చీలిన చరిత్ర పగుళ్ళలోంచి కొత్త చరిత్ర తొంగి చూడసాగింది.
                                                                         "అదేమిటి? రఘుబాబు పేరు అమరుల లిస్టులోకి ఎలా వచ్చింది? అతను రైలు రావడం చూడగానే పారిపోయాడుగా?"
                                                                        " ఇటు చూడండి...పరమేశ్వర్ పేరు కూడా ఉందిక్కడ. అతను ఎప్పుడో జానకీదహ్ లో మునిగి చనిపోయాడు."
                                                                        "అదేంటయ్యా, అతని శవం దొరికిందని అన్నారే?"
                                                                        "అది కాళేశ్వర్ ది బాబూ!"
                                                                       "ఇక చరనిక్ , అతను గడ్డం పెంచుకుని పాట్నా లోని ఏదో గుళ్ళో ఉన్నాడు!"
                                                                       "అలాగా?"
                                                                      " మరేమిటి? పూలేశు తను కళ్ళారా చూశానని అంటున్నాడు."
                                                                       "అమీరుల్లా గురించి కూడా ఎవరో చెప్పారు...ఎకాడబ్బా?...ఆ...బొంబైలో ఉన్నాడుట."
                                                                       జనం నొటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుకోటం మొదలుపెట్టారు. చాలా గోల్ మాల్ ఉంది భాయ్...చరిత్ర నిండా అబద్ధాలే!

                                                                        కళ్ళజోళ్ళు తగిలించుకుని ఒక్కొక్కరి జాతకాన్నీపరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడు ముఫ్పైమంది అమరుల పేర్లూ నిజమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డాయి.మిగతా జాతులవాళ్ళందరూ కుక్కల్లాగ మొరిగి నోళ్ళు మూసుకున్నారు కానీ  బ్రాహ్మలకీ యాదవులకీ మధ్య రగడ తలెత్తింది.రెండు వైపులా ఘోరమైన కొట్లాట జరిగిఉంటే అమరుల లిస్టు కి మరికొన్ని పేర్లు చేరి ఉండేవి. దేవుడి దయవల్ల అలా జరగలేదు.
                                                                        బోర్డులో రాత్రికి రాత్రి మార్పులు జరిగిపోయాయి. "ముఫ్పైమంది అమరులు" కి బదులు ఎవరో "ముఫ్పైమంది బ్రాహ్మలు" అని రాసేశారు ( ఊళ్ళో అక్షరాస్యత పెరిగిందనడానికి ఇదే నిదర్శనం ). మర్నాడు బ్రాహ్మలు అనే మాట చెరిపేసి యాదవులు అని రాశారెవరో.మొదటి లిస్టు లో ప్రతి పేరు ఎదుటా వాళ్ళ కులాల పేర్లు కూడా రాశారు.ఇప్పుడు  నిజం తెలుసుకునే సాకుతో మళ్ళీ వాళ్ళ కులాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే ప్రశ్న తలెత్తింది. అసలు బిలౌనా లో జరిగిన ఆ ప్రమాదం లో శవాలు ఒకదానితో ఒకటి చుట్టుకుపోయి ఎవరెవరో గుర్తుపట్టడం అసాధ్యం అయింది.అందరి రక్తమూ కలగలిసి ఒకటైపొయింది.ఒకవేళ గుర్తుపట్టగలవాళ్ళెవరైనా ఉన్నా వాళ్ళు కూడా చనిపోయారు. కొత్త కొత్త కట్టుకథలు పుట్టుకు రాసాగాయి. అవమానాలూ అహంకారాలూ రగలసాగాయి.ఇలాటి గొడవల మధ్య ఒక రోజు ఆ బోర్డే మాయమయింది. ఎవరికో తిక్కపుట్టి మొత్తం అమరులందర్నీ గంగలో కలిపేశాడు. అర్కిమిడీస్ సూత్రం ప్రకారం ఆ బోర్డు నీటిలో మునగకుండా తేలసాగింది.కొంతమందికి చరిత్రని పునరుధ్ధరించాలన్న ఆవేశం వచ్చిందిట   కానీ అది సాధ్యం కాలేదు...కారణం , ఆ బోర్డుని ఒక పాము ఆక్రమించుకుంది.ఎవరైనా దగ్గరకొస్తే బుసలు కొట్టసాగింది. ఆ విధంగా చరిత్ర లిఖిత రూపంలో కాకుండా జనం నోట్లో మాత్రమే ఉండిపోయింది. ఎవరైనా అడ్డు చెపితే ," నోరు మూసుకో ! ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం! " అని వాళ్ళ నోళ్ళు మూయించెయ్యడం మొదలుపెట్టారు.
                                                                       ఈ గొడవలతో విసిగిపోయి ఒక రోజు , శత్రుఘ్న రాయ్ తన కులంలోని ముఫ్పైమంది మూర్ఖులు రైలు కింద పడి చచ్చారని అన్నాడు. ఆయన ముఖకవళికలు చూస్తే తిడుతున్నాడో మెచ్చుకుంటున్నాడో తెలీలేదు. దాంతో బూటన్ యాదవ్ అతను చెప్పిన మాటని కాదంటూ," బ్రహ్మలయుండీ ఎందుకండీ అలా అబద్ధాలు చెప్తారు? ఆ చచ్చిపోయిన మూర్ఖులందరూ మా కులం వాళ్ళు !"అన్నాడు. చివరికి తేలిందేమంటే , చనిపోయిన వాళ్ళు అమరులు కారు , మూర్ఖులు అని.అంటే బినౌలా లో రైలు ఆపించేందుకు ముఫ్పైమంది మూర్ఖులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.రైలు సౌకర్యం రావడం తో ఊళ్ళో పిల్లలు చదువుకునేందుకు దూర ప్రాంతాలకి వెళ్ళసాగారు.యువకులు ఢిల్లీ ,ముంబై , బంగళూర్ , హైదరాబాద్ లాటి పట్టణాలకి వెళ్తున్నారు.హాథీ పేట్ లోనూ జనకీ దహ్ లోనూ స్టేషన్లు వెలిశాయి. స్టేషిన్ లేని చోట్ల చైన్ పుల్లింగ్ తో రైలు ఆగే ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రైలు ఇంటి ముందే ఆగుతుందన్నమాట. టిక్కెట్టు కొనేవాడు మూర్ఖుడు !
                                                                        బినౌలా లో విద్యావంతుల సంఖ్య పెరిగింది... అభివృద్ధి చెందింది.పాతకాలం నాటి సురాజీ కవిగారి పాటలో కులప్రసక్తి కూడా చోటు చేసుకుంది. ఆ పాటని ఒక్కో కులం వారూ ఒక్కో రకంగా పాడుకోసాగారు.కానీ అమరులు ప్రతి కులంలోనూ తమ పేర్లు ఉండాలని ఆత్రుత పడసాగారు.అంటే, రాంబృచ్ఛ బ్రాహ్మణ కులంలోనూ యాదవ కులంలోనూ,రాజపుత్రుల కులంలోనూ ఉంటాడు.అదే విధంగా గరీబ్ మియా , గరీబ్ ఖాన్ ,గరీబ్ యాదవ్ పేరు ఉంటుంది.ఆడవాళ్ళదీ  ఇదే ధోరణి.
                                                                        చరిత్ర ట్రైను లో ఇంత కుమ్ములాట ఉన్నప్పటికీ పాపం కొంతమంది నిర్భాగ్యులు ఎక్కలేక కిందే ఉండిపోతారు , ట్రైను వెళ్ళిపోతుంది.ఇలాటివాళ్ళు చెయ్యగలిగిందల్లా తిట్టుకోటమే.అందుకే ఈనాటికీ బినౌలా లో తిట్టుకుంటూ తుమ్ముకుంటూ  ఉండడం కనిపిస్తుంది.... " మా పూర్వీకులు మాత్రం రక్తం ధారపొయ్యలేదా? ఎంత అన్యాయం? ఎంత దుర్మార్గం?పురుగులు పడి చస్తారు , చూస్తూ ఉండండి! మేము మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటామా? ఏదొ ఒకటి చేసి తీర్తాం!"

                                                                       చరిత్ర తాలూకు ఈ నిర్ణయం , చూద్దాం ఎప్పుడు రూపు దాల్చుతుందో !
                                                                                                                    
                                                 -----------------------------------------------------------------------------
                                                                                                                                                                                                                                                                 అనువాదం: ఆర్. శాంత సుందరి.